జగనన్న గోరు ముద్ద అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి
ప్రభుత్వం పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద మెనూ పక్కాగా అమలు చేయాలి :-
జగనన్న గోరు ముద్ద….అమలుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి :-
మధ్యాహ్న భోజన పథకంలో నంద్యాల లాంటి ఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవు :-
విద్యాశాఖ అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు :-
కర్నూలు కలెక్టరేట్, మార్చి 16, ( సీమకిరణం న్యూస్) :
జిల్లాలోని ప్రభుత్వం పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద మధ్యాహ్న భోజనం పథకం కింద పాఠశాల విద్యార్థులకు అందిస్తున్న ‘జగనన్న గోరుముద్ద’ను మరింత పకడ్బందీగా పక్కాగా అమలు చేసేలా పర్యవేక్షణ చేయాలని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ లోని సునయన ఆడిటోరియంలో ప్రభుత్వ పాఠశాలల్లో జగనన్న గోరుముద్ద (మధ్యాహ్న భోజనం) మెనూ పక్కాగా అమలు పై విద్యా శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జగనన్న గోరుముద్ద పథకాన్ని మరింత రుచికరమైన, శుచికరమైన పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం జగనన్న గోరుముద్ద పథకంలో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని, మధ్యాహ్న భోజనంపై రూపొందించుకున్న స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ పాటించేలా అన్నిరకాల చర్యలూ తీసుకోవాలి ఆదేశించారు. కుకింగ్ ఏజెన్సీలు జగనన్న గోరుముద్ద వంటకాన్ని ఎలా వండుతున్నారు, ఏ విధంగా వండుతున్నారు, భోజనం వండే సమయంలో ప్రతిరోజూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, పాఠశాల తల్లుల కమిటీ సభ్యులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, విద్యాశాఖ అధికారులు, గ్రామ సమాఖ్యలు జగనన్న గోరుముద్దను పర్యవేక్షించి విద్యార్థులకు మరింత రుచికరమైన, శుచికరమైన పౌష్టిక ఆహారం అందేలా పర్యవేక్షించాలన్నారు. నంద్యాల లాంటి సంఘటనలు పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు. జిల్లాలో ఇలాంటి ఒక్క సంఘటన కూడా పునరావృతం కాకూడదని, అయితే మాత్రం బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. జగనన్న గోరుముద్ద పథకం అమలు పై సీరియస్ గా తీసుకొని బాధ్యతతో… చిత్తశుద్ధితో పనిచేసి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. రేపటి నుంచి విద్యాశాఖ అధికారులు పాఠశాలలను తనిఖీ చేస్తూ జగనన్న గోరుముద్ద పథకాన్ని పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. పిల్లల భవిష్యత్తు, దేశ భవిష్యత్తు మన చేతిలో ఉందని పిల్లలను ఆరోగ్యవంతమైన మంచి పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. అందుకోసం విద్యాశాఖ అధికారులు కూడా తమ బాధ్యతలను విస్మరించకుండా చిత్తశుద్ధితో వివిధ నిర్వహించాలన్నారు. జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్ మాట్లాడుతూ హెడ్ మాస్టర్ లు పాఠశాలలో పేరెంట్స్ కమిటీ తరచూ సమావేశం నిర్వహించి పాఠశాల అభివృద్ధికి సలహాలు, సూచనలు తీసుకునేలా చర్యలు చేపట్టాలన్నారు. జగనన్న గోరుముద్ద మధ్యాహ్నం భోజనం పథకం సంబంధించి విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలకు అందిస్తున్న ఎగ్స్ క్వాలిటీ, సైజు చెక్ చేయాలని ఒకవేళ సైజ్ లేకపోతే తిరస్కరించాలన్నారు. పాఠశాలల తల్లుల కమిటీ సభ్యులు, వార్డు సచివాలయ కార్యదర్శులు, గ్రామ సమాఖ్యలు జగనన్న గోరుముద్దను పర్యవేక్షించాలన్నారు. అంతకుమునుపు జగనన్న గోరుముద్ద పథకం అమలుపై సర్వ శిక్ష అభియాన్ పిఓ డాక్టర్ వేణుగోపాల్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ది) డాక్టర్ మనజీర్ జిలానీ సామూన్, సర్వ శిక్ష అభియాన్ పిఓ డాక్టర్ వేణుగోపాల్, డీఈఓ రంగారెడ్డి, ఐసిడియస్ పిడి ప్రవీణ, డిఆర్డిఏ పిడి వెంకటేశులు, డిప్యూటీ డిఈఓలు, ఎంఈఓలు, తదితరులు పాల్గొన్నారు.