
మంత్రి టీజీ భరత్ ని కలిసిన డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ
నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్
కర్నూలు క్రైమ్ జనవరి 03, (సీమకిరణం న్యూస్):
2026 నూతన సంవత్సరం పురస్కరించుకుని ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ శాఖా మంత్రి టీజీ భరత్ ని సంకల్ బాగ్లోని మంత్రి గారి నివాసంలో డిఐజి , కర్నూలు ఇన్ చార్జీ ఎస్పీ విక్రాంత్ పాటిల్ , ఎపిఎస్పీ 2 వ బెటాలియన్ కమాండెంట్ దీపికా పాటిల్ లు మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరంలో పోలీసు శాఖ మరింత సమర్థవంతంగా పనిచేయాలని రాష్ట్ర పరిశ్రమల మంత్రి ఆకాంక్షించారు.




