
క్యాన్సరును తొలి దశలోనే గుర్తించాలి… దానికి స్క్రీనింగే మార్గం
Dr. C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.
కర్నూలు టౌన్, మార్చి 29, (సీమకిరణం న్యూస్) :
క్యాన్సరును 4 స్టేజీలు గా విభజించారు-
1. చిన్నగా మొదలయ్యే దశ.. ఏ లక్షణాలు ఉండవు..
2. అది లింఫాటిక్సు ద్వారా వెళ్ళి లింఫ్ గ్రంధులు వాపు
3.గడ్డ పెద్దగా ఉండి లింఫు గ్రంధులు ద్వారా దూర తీరాలకు పాకి వాచి పోయింటాయి
4. కాన్సరు రక్తం ద్వారా శరీరమంతా అన్ని అవయవాలకు వ్యాపిస్తుంది..
మొదట రెండు స్టేజులలో ఆపరేషను, మూడవ స్టేజులో ఆపరేషను తో పాటు రేడియోధిరపీ లేక కీమోధిరపీ లేక రెండూ కలిపి ఇస్తారు,,
సక్సెసు రేటును 5 సంవత్సరాలు బ్రతికే కాలంతో గుణిస్తారు.. మొదటి రెండు స్టేజిలలో 60-80% మూడవ నాలుగులో 20% 40%ఉండచ్చు,. అది ఒక్కో క్యాన్సరుకు ఒక్కోరకం., అది ఏ కణం నుంచి క్యాన్సరు వచ్చింది,, ఏ అవయవం నుంచి క్యాన్సరు వచ్చింది అనే దానిని పట్టి ఉంటాది..
ఆఖరు స్టేజీలో విపరీతమైన నొప్పి ఉంటాది.. దీని నివారణకు పాలియేటివ్ ధిరపీ అని నొప్పి మత్తు మందులిస్తారు,, స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి,. కర్నూలు ఆసుపత్రి లో ఈ పాలియేటివ్ విభాగం ఉంది,,.
క్యాన్సరు పై విజయం సాధించాలంటే తొలిదశలో కనుక్కోగలగాలి,,,
దీనికి రెండు పద్ధతులున్నాయి,,
1. క్యాన్సరు లో నొప్పి ఉండదు., కాని కొన్ని రకాల సూచనలు శరీరము మనకిస్తాది,, అపుడే పట్టుకోవాలి… వెనువెంటనే పరీక్షలు చేసుకోవాలి,,, ఉదాహరణకు,,,
a) దగ్గితే రక్తం పడడం – ఊపిరితిత్తులు క్యాన్సరు
b) మెనోపాజల్ మహిళలలో ఎర్రమైల కావడం – గర్భాశయ క్యాన్సరు
c) నోటిలో పుండు లా రావడం -నోటి క్యాన్సరు
d) చనులలో గడ్డ రావడం – బ్రెస్టు క్యాన్సరు.. ప్రతి మహిళ స్నానం చేసేటపుడు తన బ్రెస్టును తన అరచేతితో సవ్య దిశలో స్పృశిస్తూ కొంచెం వత్తిడితో తిప్పాలి,, అలా చేస్తే గడ్డలుంటే తెలుస్తాయి,, వెంటనే వైద్య పరీక్షలు చేసుకోవాలి..దీనినే సెల్ఫ్ మాన్యువల్ ఎగ్జామినేషన్ అంటారు,,
2. అలా కాకుండా మాస్ స్క్రీనింగు పద్ధతి,. రిస్కు గ్రూపులను గుర్తించి వారికే లక్షణాలు లేకపోయినా పరీక్షలు చేయడం,. వాలంటరీగా ప్రజలు ముందుకు రావాలి,, బోలెడంత ఖర్చు,. చదువు తక్కువ/అతి ఎక్కువ ఉన్న మన దగ్గర కష్ఠం.. కంపల్సరీగా చేయలేం,,.
అయినా దేశంలో మొట్టమొదటి సారిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ బృహత్కర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది.. పైలట్ గా వైద్యులచే నిన్న తూళ్ళూరు లోని దొండపాడులో మహిళలకు గైనకాలజీ, ఆంకాలజీ వైద్యులతో పరీక్షలు చేసారు,,రొమ్ము క్యాన్సర్, నోటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ కు (పాప్ స్మియరు) పరీక్షలు చేసారు,. 30-60 ఏళ్ల మహిళలు 640 మంది ఉంటే పరీక్షలు కు కేవలం 240 మంది ముందుకొచ్చారు..వీరిలో 70 మందికి బ్రెస్టు గడ్డల అనుమానంతో మామోగ్రాముకు పంపారు,,
మనం తెలుసుకోవలసిందేంటంటే మనకు అన్నీ అనుమానమే,, ఏంచేస్తారో అని,, దీనివలన ఎవరికి లాభమో అని,,లేదు కాన్సరు అని తెలిస్తే సోషియల్ స్టిగ్మా ఉంటాదని, చిన్నచూపు చూస్తాదని భయపడతారు…
బ్రెస్టు లో గడ్డ ఉంటే అన్ని గడ్డలు క్యాన్సర్ కాదు., ఫైబ్రోఅడినోమా అని మామూలు గడ్డలూ ఉండచ్చు.. దగ్గితే రక్తం పడితే లంగ్ క్యాన్సర్ కాకపోవచ్చు., కావున భయమనవసరం., చిన్నపామునైనా పెద్దకట్టెతో కొట్టాలి.. అంతే…
కావున మాస్ స్క్రీనింగ్ చేస్తే అందరూ చేయించుకోండి , లేదా తొలి లక్షణాలు వస్తానే పరీక్షలు అయినా చేసుకోండి,, కాని నిర్లక్ష్యంగా ఉండకండి,, కాన్సరు లేటుగా గుర్తిస్తే మరణమే శరణం…
కాన్సరును తొలిదశలోనే గుర్తించాలి..దానికి స్క్రీనింగే మార్గం..
Dr. C. ప్రభాకర రెడ్డి MS MCh (CTVS)
గుండె మరియు ఊపిరితిత్తుల శస్త్రచికిత్స నిపుణులు
కర్నూలు. ఆంధ్రప్రదేశ్.