BREAKING NEWSBUSINESSCRIMEHEALTHMOVIESPOLITICSSTATETELANGANA

2024 ఎన్నికల్లో దేశ ప్రధానిగా రాహుల్

2024 ఎన్నికల్లో దేశ ప్రధానిగా రాహుల్

-: నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు జె లక్ష్మి నర్సింహా యాదవ్

నంద్యాల సిటీ, మార్చి 10, (సీమకిరణం న్యూస్) :

2024లో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో ఈ దేశానికి రాహుల్ గాంధీ ప్రధాని అవడం ఖాయ మని నంద్యాల పార్లమెంట్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు లక్ష్మి నరసింహా వ్యాఖ్యా నించారు. స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం పట్టణ అధ్యక్షుడు చింతలయ్య అధ్వర్యంలో డిజిటల్ సభ్యత్వ నమోదుపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్య క్రమం పెద్ద ఎత్తున నిర్వహించా లని, నియోజకవర్గాలలో కాంగ్రె స్ పార్టీ వైపు ప్రజలు ప్రత్యేక శ్రద్ధతో చూస్తున్నారని, మన మందరం కష్టపడి పార్టీ ఓటు బ్యాంకును మరలా తెచ్చు కోవ డానికి కృషి చేయాలన్నారు. డిజిటల్ సభ్యత్వ నమోదుపై ప్రతి నాయకుడు, కార్యకర్త పూర్తి అవగాహనతో ఉండాల న్నారు. డిజిటల్ సభ్యత్వం నమోదు ద్వారా ప్రతి ఒక్కరి వివరాలు సులభంగా తెలుస్తా యని, ఇది చాలా ఉపయోగ కరంగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల అసెంబ్లీ కో ఆర్డినేటర్ ఫారూఖ్ , రాష్ట్ర అధికార ప్రతినిధి ఉకొట్టు వాసు , ట్రెజరర్ ప్రసాద్, నాయ కులు శివారెడ్డి, షేక్ రఫీ, మహేష్ యాదవ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!