కర్నూలును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం

కర్నూలును అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నాం
కర్నూలు టౌన్, మార్చి 31, (సీమకిరణం న్యూస్) :
సీఎం వైఎస్ జగన్ సహకారంతోనే కర్నూలును అభివృద్ధి లో పరుగులు పెట్టిస్తున్నామని నగర మేయర్ బి.వై. రామయ్య అన్నారు.గురువారం కర్నూలు నగరంలో 2.55 కోట్లకు సంబంధించిన అభివృద్ధి పనులకు మేయర్ బి.వై. రామయ్య, ఎమ్మెల్యేలు హఫీజ్ ఖాన్ , కాటసాని రాంభూపాల్ రెడ్డి, కమిషనర్ డి.కే. బాలాజీలు ప్రారంభించారు.అలాగే కోటి నలభై ఐదు లక్షల ముప్పై వేలకు సంబంధించి కొండారెడ్డి బురుజు ఆవరణ అభివృద్ధి, సుందరీకణకు శంకుస్థాపన చేశారు.20వ వార్డు గఫూర్ నగర్ లో 1.87 కోట్లతో సైన్స్ నమూనాలతో నిర్మించిన థీమ్ పార్కును, 23వ వార్డు సి.క్యాంపు సెంటర్లో 17 లక్షలతో నిర్మించిన నాటి కొండారెడ్డి బురుజు, కందనవోలు నిర్మాణాన్ని, 43వ వార్డు సుందరయ్య సర్కిల్లో 8 లక్షలతో నిర్మించిన వాటర్ ఫౌంటేన్ను, మార్కెట్ యార్డు ఎదురుగా 18 లక్షలతో నిర్మించిన గ్రీన్ టాయిలెట్లను, 46వ వార్డు ఆశోక్ నగర్లో పార్కును 25 లక్షలతో నిర్మించిన పైనాపిల్ థీమ్, ఫౌంటేన్లను మేయర్, ఎమ్మెల్యేలు, కమిషనర్ ప్రారంభించగా, 51 వార్డు 1.45 కోట్ల 30 వేల వ్యయంతో కొండారెడ్డి బురుజు వెనుక భాగం ఆవరణలో అభివృద్ధి మరియు సుందరీకరించేందుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కర్నూలంటే ఎంతో ఇష్టం ఉంది కాబట్టే కర్నూలును న్యాయ రాజధాని చేసేందుకు అనేక ఆటంకాలను ఎదుర్కొంటూ వెనకడుగు వేయకుండా ముందుకెళ్తునరన్నారు..ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్ రెడ్డి , హఫీజ్ ఖాన్ లు మాట్లాడుతూ నగర అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు.రాబోయే రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు.కమిషనర్ మాట్లాడుతూ నగరంలో మౌలిక సదుపాయాల కల్పనకు, సుందరీకరణకు పెద్ద పీట వేశామని, భవిష్యత్తులో కర్నూలు నగరాన్ని దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక నగరంగా కర్నూలును ఉంచాలన్నదే తమ ధ్వేయమన్నారు.నగరంలో ప్రతి పార్కులో ఒక థీమ్ ను నిర్మిస్తున్నామన్నారు.ఈ పార్కుల ద్వారా విద్యార్థులకు సులువుగా అర్థం అవుతుందన్నారు.కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సిద్దారేణుక, కార్పొరేటర్లు లక్ష్మి రెడ్డి, వైజ అరుణ, కటారి పల్లవి, మునెమ్మ, శ్రీనివాసరావు, మౌనికరెడ్డి, విక్రమసింహా రెడ్డి, యూనూస్, సుదర్శన్ రెడ్డి, కైప పద్మాలత, షాషావలి, కో అప్షన్ మెంబర్లు సుకన్య, శ్రీరాములు, ఎస్.ఈ. సురేంద్ర బాబు, ఎం.ఈ. శేషసాయి, డిఈఈలు రవిప్రకాష్ నాయుడు, షాకీర్ హుస్సేన్, రాజశేఖర్, హార్టికల్చర్ ఆఫిసర్ సుజాత, ఏఈలు భార్గవి, హిమబిందు, దినేష్, తదితరులు పాల్గొన్నారు.