కౌలు రైతు ఆత్మహత్య
కౌలు రైతు ఆత్మహత్య
పంట నష్టాలతో అప్పులపాలై పురుగుల మందు తాగి అన్నదాత
పురుగుల మందు తాగి మృతి చెందిన కౌలు రైతు హాజీ బాబు
కొలిమిగుండ్ల, ఏప్రిల్ 04, (సీమకిరణం న్యూస్) :
కౌలుకు తీసుకొని సాగు చేసిన పంటలు నష్టాలు కలగడంతో అప్పులు పాలైన రైతన్న దిక్కుతోచని స్థితిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పులు తాళలేక అనంతపురం జిల్లా అన్నదాత కొలిమిగుండ్ల మండల పరిధిలో ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల కేంద్రానికి చెందిన దూదేకుల హాజీ బాబు(30) కొలిమిగుండ్ల మండలం గోరుమాని పల్లి గ్రామంలో అత్తారింటిలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హాజీబాబు యాడికి మండలం వేములపాడు గ్రామ పరిధిలో 48 ఎకరాలు కౌలుకు తీసుకొని 2021 సంవత్సరంలో పంటలను సాగు చేశారు. తన గ్రామంలో తెలిసిన వారి దగ్గర 10 లక్షల రూపాయల అప్పు తీసుకొని పత్తి పంటను సాగు చేయగా కొద్దిగా దెబ్బతిని అప్పుల పాలయ్యాడు. చేసిన అప్పులు ఎలా తీర్చాలి అని ప్రతిరోజూ హాజీ బాబు మదనపడుతూ ఉండేవాడని తల్లిదండ్రులు ఏదోవిధంగా అప్పులు చెల్లిస్తాంలే అని సముదయించేవారు.పత్తి పంట సాగు చేసి నిండా మునిగిన హాజీ బాబు తాను వివాహం చేసుకున్న అత్తవారు ఉన్న గోరుమాన్ పల్లి గ్రామానికి ఈ నెల మూడో తేదీన వచ్చి పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ కోలుకోలేక సోమవారం మృతి చెందాడు. హాజీ బాబు తల్లి మాబున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై హరినాథ్ రెడ్డి తెలిపారు.