ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATEWORLD

దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించండి

జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు

ఆకస్మికంగా గ్రామ సచివాలయాలు తనిఖీ :-

సచివాలయంలో అందుతున్న సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలి :-

స‌చివాల‌యం సంద‌ర్శించే వారితో గౌర‌వంతో వ్య‌వ‌హ‌రించాలి :-

ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించండి :-

సచివాలయం ద్వారా రోజులో వీలైనన్ని ఎక్కువ సర్వీసులను సకాలంలో అందించండి :-

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి సేవలు అందించండి :-

సచివాలయ సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్ పి. కోటేశ్వర రావు :-

కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 06, (సీమకిరణం న్యూస్) :-

సచివాలయంలో అందుతున్న సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందిని జిల్లా కలెక్టర్ పి.కోటేశ్వర రావు ఆదేశించారు. బుధవారం కల్లూరు మండలం, పర్ల గ్రామ సచివాలయం 1 మరియు 2 లను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సచివాలయంలో సిబ్బంది హాజరు పట్టిక, ఉద్యోగుల మూవ్మెంట్ రిజిస్టర్, సంక్షేమ పథకాల క్యాలెండర్, ఎస్ఎల్ఏ గడువులోగా ప్రజా సమస్యల పరిష్కార చర్యల నివేదిక తదితర రికార్డులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. సర్వీసులకు సంబంధించి పర్ల సచివాలయం 2 పరిధిలో ఎన్ని పెండింగ్లో ఉన్నాయిని సచివాలయ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా, బియాండ్ ఎస్ ఎల్ఏలో ఏమి లేవని, విత్ ఇన్ ఎస్ యల్ ఏలో 3 అర్జీలు ఉన్నాయని, త్వరగా పరిష్కరిస్తామని సచివాలయ కార్యదర్శులు జిల్లా కలెక్టర్ కు విన్నవించారు. పర్లా సచివాలయం 2 పరిధిలో ఎన్ని ఇళ్లు మంజూరు అయ్యాయి, ఇంకా మొదలు పెట్టని ఇళ్లు ఎన్ని అని సచివాలయ కార్యదర్శిను జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా 58 ఇళ్లు మంజూరయ్యాయని, ఇందులో 46 ఇళ్లు వివిధ దశల్లో ఉన్నాయని, ప్రారంభం కానీ ఇళ్లను వెంటనే ప్రారంభించేల లబ్ధిదారులకు అవగాహన కల్పిస్తామన్నారు. పర్ల 1 గ్రామ సచివాలయంలో సర్వీస్ లో ఎన్ని పెండింగ్ లో ఉన్నాయిని సచివాలయ కార్యదర్శిని జిల్లా కలెక్టర్ ప్రశ్నించగా ఒకటి మాత్రమే ఉందని జిల్లా కలెక్టర్ కు సచివాలయ కార్యదర్శి వివరించారు. సచివాలయ సిబ్బంది ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి తెలియజేస్తున్నారా… అందుబాటులో ఉంటున్నారా….అని గ్రామస్థులతో జిల్లా కలెక్టర్ ఆరా తీయగా సచివాలయ సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్నారని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. ఏమైనా సమస్యలు ఉంటే  సచివాలయంలో తెలియజేయాలని గ్రామస్థులకు జిల్లా కలెక్టర్ సూచించారు. పౌర సేవలను మరింత విస్తృతంగా అమలు చేయాలన్నారు. ప్రజల నుంచి అందిన దరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలన్నారు. సచివాలయం ద్వారా రోజులో వీలైనన్ని ఎక్కువ సర్వీసులను సకాలంలో అందించాలన్నారు. సచివాలయంలో అందుతున్న సర్వీసులను సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. పౌర సేవల సంఖ్యను పెంచడానికి నిత్యం అడ్మిన్ కార్యదర్శులతో సమీక్ష నిర్వహించి మున్ముందు మరింత వేగంగా సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!