TELANGANA
డ్రగ్స్ నియంత్రణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం
డ్రగ్స్ నియంత్రణలో టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం..
టిఆర్ఎస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ నిరసన
టీఎన్ఎస్ఎఫ్.. తెలంగాణ జన సమితి..
కామారెడ్డి , ఏప్రిల్ 09, (సీమకిరణం న్యూస్) :
తెలంగాణ రాష్ట్రంలో గంజాయి ,డ్రగ్స్ లను నియంత్రించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలు, తెలంగాణ జనసమితి కామారెడ్డి జిల్లా ఇన్చార్జి కుంబాల లక్ష్మణ్ యాదవ్ లు ఆరోపించారు.తెలంగాణ రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి,డ్రగ్స్ అమ్మకాలు కొనసాగుతున్నాయని వాటిని నియంత్రించడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం వైఫల్యం చెందిందని వెంటనే డ్రగ్స్ అమ్ముతున్న వారిపైనా,వినియోగిస్తున్న వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. బంగారు తెలంగాణ పేరుతో తెలంగాణ రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ తెలంగాణ మార్చడం జరిగిందన్నారు.పబ్బులకు 24 గంటల అనుమతి ఇవ్వడం వల్లనే ఇలాంటి పరిణామాలు తలెత్తుతున్నాయని,మద్యం అమ్మకాల మీద ఉన్నశ్రద్ధ డ్రగ్స్ ను నియంత్రించడంలో లేదన్నారు.ఈ కార్యక్రమంలో విద్యార్థిని,విద్యార్థులు పాల్గొనడం జరిగింది.