ANDHRABREAKING NEWSSTATEWORLD

ప్రవహించే ఉత్తేజం కామ్రేడ్ జార్జిరెడ్డి

జార్జిరెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

ప్రవహించే ఉత్తేజం కామ్రేడ్ జార్జిరెడ్డి

జార్జిరెడ్డి స్ఫూర్తితో ఉద్యమిద్దాం

50వ వర్ధంతి సందర్భంగా బహిరంగ సభ

పీ డీ ఎస్ యూ మాజీ జిల్లా అధ్యక్షుడు శేషఫణి

కర్నూలు టౌన్, ఏప్రిల్ 14, (సీమకిరణం న్యూస్) :

నేటి సమాజంలో ప్రవహించే ఉత్తేజం కామ్రేడ్ జార్జిరెడ్డి అని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం(పీ డీ ఎస్ యూ) మాజీ జిల్లా అధ్యక్షుడు శేషఫణి, రాష్ట్ర కార్యదర్శి కె.భాస్కర్ కొనియాడారు.
అనంతరం స్థానిక కర్నూలు పట్టణంలో జార్జిరెడ్డి 50వ వర్ధంతి సందర్భంగా బహిరంగసభ నిర్వహించడం జరిగింది. ఈ సభకు జిల్లా ఉపాధ్యక్షుడు రవితేజ అధ్యక్షత వహించగా ముఖ్య వక్తగా విచ్చేసిన మాజీ జిల్లా అధ్యక్షుడు శేషఫణి , రాష్ట్ర కార్యదర్శి కె.భాస్కర్ మాట్లాడుతూ పీ డీ ఎస్ యూ నిర్మాత, ఉస్మానియా అరుణతార జార్జిరెడ్డి. అమరత్వం పొందే నేటికీ 50 ఏళ్ళు అయిందని అన్నారు. విప్లవ విద్యార్థి ఉద్యమ చరిత్రలో జార్జిరెడ్డి త్యాగం చిరస్థాయిగా నిలుస్తుంది అని కొనియాడారు. ఆర్ఎస్ఎస్ మతోన్మాద ఫాసిస్టు శక్తులు చేతుల్లో బలైన జార్జి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమానికి బాటలు వేశాడు అన్నారు. జార్జిరెడ్డి మతోన్మాదానికి వ్యతిరేకంగా ఉద్యమించి అమరుడు అయ్యారని కొనియాడారు.జార్జి విరోచిత త్యాగం నేటి విద్యార్థి,యువతకు ఆదర్శప్రాయం అని కొనియాడారు. జార్జిరెడ్డి స్ఫూర్తితో ఐదు దశాబ్దాలుగా విద్యారంగ సమస్యలపై రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. నేడు మోడీ ప్రభుత్వం విద్య కాషాయీకరణ మతోన్మాదాన్ని పెంచి పోషించడానికి నూతన జాతీయ విద్యా విధానాన్ని అమలు చేస్తుందని దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమించాలని పిలుపునిచ్చారు. జార్జి రెడ్డి ఆశయాలను కొనసాగించడం కోసం శాస్త్రీయ విద్యా విధానం కోసం, సమసమాజ స్థాపన కోసం, మతోన్మాద శక్తులకు వ్యతిరేక పోరాటం చేయడమే నిజమైన నివాళి అని కొనియాడారు. నేటి యువత విద్యార్థులు జార్జి రెడ్డి ఆదర్శంగా తీసుకుని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై ఉద్యమించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పీ డీ ఎస్ యూ జిల్లా నాయకులు అఖండ, ఐ ఎఫ్ టి యూ జిల్లా కోశాధికారి టి. తిరుపాల్, సురేష్ నాయక్,బిను, మనోజ్, నితిన్,సురేష్, మోహన్, కిషోర్ మొదలైన వారు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS...RNI REGISTRATION NUMBER...RNI : APTEL/2018/76380.... S.K. NAZEER.FOUNDER , EDITOR & PUBLISHER.SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD.SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA |Telugu News | Latest News Online | Political News in Telugu | AndhraPradesh Latest News | AP Political News | Telangana News | TelanganaPolitics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!