
లోకాయుక్త సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోండి
ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి
సంతోష్ నగర్ లో కొత్తగా నిర్మించిన లోకాయుక్త సంస్థ కార్యాలయం నుంచి కార్యకలాపాలు
లోకాయుక్త సంస్థ కార్యాలయాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి
కర్నూలు కలెక్టరేట్, ఏప్రిల్ 18, (సీమకిరణం న్యూస్) :
ఇంతకు ముందు కర్నూలు నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్ లో లోకాయుక్త సంస్థ కార్యకలాపాలు కొనసాగేవని, ఇప్పుడు సంతోష్ నగర్ లో కొత్తగా నిర్మించిన లోకాయుక్త సంస్థ కార్యాలయం నుంచి కార్యకలాపాలు కొనసాగుతాయని ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం కర్నూలు – హైదరాబాద్ జాతీయ రహదారి ఆనుకొని ఉన్న సంతోష్ నగర్ లో నూతనంగా నిర్మించిన లోకాయుక్త సంస్థ కార్యాలయాన్ని ఆంధ్ర ప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అంతకు ముందు ఆంధ్రప్రదేశ్ లోకాయుక్త జస్టిస్ పి.లక్ష్మణ రెడ్డి వారిని దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో వేదపండితులు పూర్ణ కుంభతో స్వాగతం పలికారు. అనంతరం లోకాయుక్త సంస్థ చైర్మన్ ఛాంబర్ లో ఆసీనులై వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. లోకాయుక్త సంస్థ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని వారు తెలిపారు. లోకాయుక్త సంస్థ కార్యాలయ ప్రారంభంలో రిజిస్ట్రార్ విజయలక్ష్మి, లోకాయుక్త సంస్థ ఐజి నరసింహారెడ్డి, డైరెక్టర్ లీగల్ వెంకటేశ్వర రెడ్డి, డిప్యూటీ రిజిస్ట్రార్ పోలయ్య, డిప్యూటీ డైరెక్టర్ లీగల్ మురళీ మోహన్ రెడ్డి, లోకాయుక్త సంస్థ డీఎస్పీలు, ఆర్ అండ్ బి ఎస్ఈ శ్రీధర్ రెడ్డి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషు నాయుడు, లోకాయుక్త సంస్థ కార్యాలయ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.