
గ్రామ అభివృద్ధికి కృషి
▪️ సర్పంచ్ కందుల మల్లేశ్వరి ప్రసాద్ రెడ్డి
శిరివెళ్ళ, ఏప్రిల్ 19, (సీమకిరణం న్యూస్) :
వెంకటాపురం మండల పరిధిలోని వెంకటాపురం గ్రామంలో ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డుకు మంగళవారం శంకుస్థాపన చేసినట్లు గ్రామ సర్పంచ్ కందుల మల్లేశ్వరి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడు తూ గౌరవఎమ్మెల్సీ గంగుల ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి సహాయ సహకారాలతో గ్రామాభివృద్ధి చేయడం జరుగు తుందని తెలిపారు. ఎస్సీ కాలనీలో గతంలో సిసి రోడ్లు లేవని వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎస్సీ కాలనీలో సీసీ రోడ్డు కావాలని ఎమ్మెల్యే గంగుల బిజేంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని ఆయన స్పందించి మంజురు చేయడం జరిగిందన్నారు. సుమారు 150 మీటర్ల పొడవుతో సిసి రోడ్డుకు సుమారు రూ.5.5 లక్షల రూపాయలతో నిర్మించడం జరుగుతుందనిఅన్నారు. గంగుల సహాయ సహకారాలు ఉన్నంతవరకు గ్రామాభివృద్ధి జరుగుతూనే ఉంటుందని గ్రామ సర్పంచ్ కందుల మల్లేశ్వరి ప్రసాద్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ ఉపసర్పంచ్ తిరుపతి రెడ్డి, గ్రామ ఉపసర్పంచ్, వార్డ్ మెంబర్ రవణమ్మ, గ్రామ వార్డు మెంబర్లు దొర్నిపాడు రఫీ , దొర్నిపాడు ఇజాజ్, గ్రామ నాయకులు తదితరులు పాల్గొన్నారు.