జిందాల్ కంపెనీ వారి ఆర్థిక సహకారంతో ఆటవస్తువులను పంపిణీ
జిందాల్ కంపెనీ వారి ఆర్థిక సహకారంతో లక్ష రూపాయలు విలువగల ఆటవస్తువులను పంపిణీ
డోన్ టౌన్, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :
డోన్ మండలం కమలాపురం గ్రామం నందు మండల పరిషత్ స్కూల్ పిల్లలకు చదువుతోపాటు ఆటపాటల ప్రాముఖ్యత ఉండాలని కమలాపురం గ్రామం నందు గల జిందాల్ కంపెనీ వారి ఆర్థిక సహకారంతో తో డోన్ ఎంపీపీ R రాజశేఖర్ రెడ్డిచేతుల మీదుగా దాదాపు లక్ష రూపాయలు విలువగల ఆటవస్తువులను సోమవారం రోజు స్కూల్లో హెడ్మాస్టర్ కు అందజేయడం అయినది. ఈ సందర్భంగా రాజశేఖర్ రెడ్డి గారు మాట్లాడుతూ మన ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి నూతన విద్యా విధానంలో వచ్చిన మార్పుకు ప్రైవేట్ స్కూల్స్ ను వదులుకొని గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవుతున్నారని చెబుతూ, స్కూల్ టీచర్స్ తక్కువగా ఉన్న ఎడల ఊరిలో లో విద్యా వాలంటీర్ ను నియమించుకోవాలని చెప్పడం జరిగింది .అందుకు అయ్యే ఖర్చు ఎంపిపి గారు భరించుకుంటమని చెప్పడం జరిగింది .మరియు కమలాపురం యువ నాయకుడు బుగ్గన జయచంద్రారెడ్డి గారు రెండు మండల పరిషత్ స్కూల్స్ కు రెండు మైక్ సెట్స్ పంపిణీ చేయడం జరిగింది.ఈ కార్య క్రమంలో జిందాల్ కంపెనీ మేనేజర్ అంకల్ రెడ్డి గారు స్కూల్ కమిటీ చైర్మన్ శ్రీనివాసులు, శివరామిరెడ్డి, మధుసూదన్ రెడ్డి, లక్ష్మయ్య భాస్కర్ రెడ్డి ఎద్దుల గోపాల్ రెడ్డి, షేక్ పీరా గారు పాల్గొనడం జరిగింది.