విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్

విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం
జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్
కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్) :
కర్నూలు నగరంలోని కొత్తపేట దగ్గర ఉన్న స్పందన కార్యాలయంలో జిల్లా ఎస్పీ సిహెచ్. సుధీర్ కుమార్ రెడ్డి ఐపియస్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు. స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం ఇప్పటివరకు 74 ఫిర్యాదులు వచ్చాయి. స్పందనకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో మాట్లాడారు. వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని ….
1) మా కుమార్తె కు ANM ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి ఒక వ్యక్తి లక్ష 30 వేలు తీసుకుని మోసం చేశారని గోనెగండ్ల మండలం, గంజిల్ల గ్రామానికి చెందిన పెద్దయ్య ఫిర్యాదు చేశారు.
2) నా అన్నదమ్ములు నా పొలం ను ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నారని పెద్దకడుబూరు మండలం, చిన్నతుంబళం గ్రామానికి చెందిన హనుమంతు ఫిర్యాదు చేశారు.
3) మిరపకాయల కోనుగోలులో కర్నూలు కు చెందిన ఒక వ్యక్తి డబ్బులు ఇస్తానని ఒప్పందం చేసుకుని మిగతా డబ్బులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అలంపూరు మండంలం, శింగవరం గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.
4) ప్రేమ వివాహం చేసుకుని భర్త వేధింపులు, ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఓర్వకల్లు మండలం, హుస్సేనాపురం గ్రామానికి చెందిన కల్పన ఫిర్యాదు చేశారు.
5) కోళ్ళ ఫారం వ్యాపారం లో ఒక వ్యక్తి నన్ను భాగస్వామి గా చేర్చుకుని నమ్మించి రూ. 11 లక్షలు తీసుకుని మోసం చేశాడని తిరిగి ఇవ్వడం లేదని కర్నూలు, చల్లవారి వీధికి చెందిన రమణారెడ్డి ఫిర్యాదు చేశారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమంలో డిఎస్పీలు యుగంధర్ బాబు, వెంకటాద్రి ఉన్నారు.