రంజాన్ మాసంలో పేదలకు సాయం చేయాలి
రంజాన్ సందర్భంగా చీరల పంపిణీ
రంజాన్ మాసంలో పేదలకు సాయం చేయాలి
కర్నూలు టౌన్, ఏప్రిల్ 28 (సీమకిరణం న్యూస్) :
రంజాన్ పండుగ సందర్భంగా ఉపవాస దీక్ష చేస్తున్న పేద మహిళలకు జనసేన పార్టీ ,
హిమాలయ గురూజీ ఆశీస్సులతో శాంతి ఆశ్రమం ట్రస్ట్ ఆధ్వర్యంలో చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు చింత సురేష్ బాబు, నక్కల మిట్ట శ్రీనివాసులు, మహబూబ్ బాషా, హసీనా బేగం మాట్లాడుతూ ప్రతి సంవత్సరం రంజాన్ పండగ సందర్భాన్ని పురస్కరించుకొని నగరంలోని పేద ప్రజలు నివసిస్తున్న కాలనీలలో ఈ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఎంతో మంది ప్రజలు పండగ సందర్భంగా తను కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు.
వారిని దృష్టిలో పెట్టుకొని చీరల పంపిణీ చేశామని అన్నారు. జనసేన పార్టీ పేద ప్రజలకు తప్పనిసరిగా అండగా ఉంటుందని అన్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తు
ఉన్నారని అన్నారు. ఆయన మార్గంలోనే జనసేన కార్యకర్తలు నాయకులు సహకారం అందిస్తున్నారని వారు పేర్కొన్నారు. నగరంలోని జోహరపురం పాల కొట్టలు, వికర్సెక్షన్ కాలనీ తదితర కాలనీలలో నివసిస్తున్న పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో జనసేన పార్టీ కార్యకర్తలు మంజునాద్, అన్వర్ హుస్సేన్, కొండల్
యన్ మేరీ, యన్.మున్నీ, గోపాల్, నిఖిల్, రాజేష్ రెడ్డి, షేక్షా పాల్గొన్నారు.