ఇఫ్తార్ విందు ప్రజల మధ్య ఆత్మీయతను పెంపొందిస్తాయి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్.బి అంజాద్ బాష
ఇఫ్తార్ విందు ప్రజల మధ్య ఆత్మీయతను పెంపొందిస్తాయి
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్.బి అంజాద్ బాష
నంద్యాల జిల్లా ప్రతినిధి, ఏప్రిల్ 30, (సీమకిరణం న్యూస్) :
రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో అన్ని జిల్లాల్లో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ప్రజల మధ్య ఆత్మీయతను పెంపొందిస్తాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్.బి అంజాద్ బాష పేర్కొన్నారు. శనివారం సాయంత్రం మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నంద్యాల పట్టణంలోని ఆర్.కె. కన్వెన్షన్ హాలులో ఏర్పాటు చేసిన “ఇఫ్తార్ విందు” కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.బి. అంజాద్ బాషా, నంద్యాల పార్లమెంట్ సభ్యులు పోచా బ్రహ్మానంద రెడ్డి, ఎమ్మెల్సీ ఇషాక్ బాషా,స్థానిక ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే బ్రిజేంద్రనాథ్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డా. మనజీర్ జిలాని సామూన్ లు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి యస్ బి అంజాద్ బాషా మాట్లాడుతూ… కులమతాలకు అతీతంగా రాష్ట్రంలోని 26 జిల్లాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసి ప్రజల మధ్య ఆత్మీయతను పెంపొందిస్తాయన్నారు. జిల్లా ఇంచార్జి మంత్రిగా నంద్యాల జిల్లాకు వచ్చి పవిత్ర రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుకు హాజరు కావడం సంతోషంగా వుందని మంత్రి అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టిన పథకాల వల్ల ముస్లిం విద్యార్థిని విద్యార్థులు అందరూ ఉన్నతమైన చదువులు చదువుకుని ఉన్నత స్థానాల్లో స్థిరపడారన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా మైనార్టీకి చెందిన నన్ను క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారన్నారు. మైనారిటీ సామాజిక వర్గానికి పెద్దపీట వేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక ఉన్నత పదవులు కల్పించారన్నారు. కులమతాలకతీతంగా… ఆర్హత ప్రామాణికంగా తీసుకొని పేదలందరికి ఆర్థిక లబ్ధిని చేకూర్చారన్నారు.
*ఈ కార్యక్రమంలో డిఆర్ఓ పుల్లయ్య, ఆర్డీఓ శ్రీనివాసులు, మైనారిటీ సంక్షేమ అధికారి మహబూబ్ బాషా, మైనార్టీ నాయకులు, ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.