దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తాం
దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తాం
దేవాదాయ భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటాం
కర్నూలు లో దేవాదాయ కార్యాలయాల భవన నిర్మాణాలకు భూమిపూజ చేసిన ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ
కర్నూలు కలెక్టరేట్, మే 06, (సీమకిరణం న్యూస్)* :
దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖా మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. శుక్రవారం కర్నూలు నగర శివార్లలో కోటి యాభై లక్షల రూపాయలతో నిర్మించనున్న దేవాదాయ ఉప కమీషనర్, సహాయ కమీషనర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కార్యాలయాల భవన నిర్మాణాలకు ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖామంత్రి కొట్టు సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ కర్నూలు నగరంలో దేవాదాయ శాఖ కార్యాలయాలకు సొంత భవనాలు ఒకే ప్రాంగణంలో ఉండేలా ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. ప్రభుత్వం ఆలోచలనకు అనుగుణంగా వీటిని నిర్మించడం జరుగుతోందన్నారు. రాష్ట్రంలో దేవాలయాల అభివృధ్దికి కృషి చేస్తామని, అలాగే దేవాదాయ భూములు అన్యాక్రాంతం కాకుండా వాటి పరిరక్షణకు కృషి చేస్తామని మంత్రి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను పారదర్శకంగా లబ్దిదారులకు అందరికీ అందేలా చర్యలు తీసుకోవడం జరుగుతోందన్నారు. కరోనా మహమ్మారి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆర్థికంగా కుదుపేసినా, ఏ ఒక్క కుటుంబానికి కూడా ఇబ్బంది లేకుండా ఆదుకున్నామన్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమం అనంతరం ఉప ముఖ్యమంత్రి జిల్లాలోని ప్రముఖ రాంబొట్ల దేవాలయం మరియు నగరేశ్వర స్వామి ఆలయాలను సందర్శించారు.. నగరేశ్వర స్వామి దేవాలయం పునరుద్ధరణ కు మరియు రాంభట్ల దేవాలయం గాలిగోపురం నిర్మాణానికి ఫండ్ మంజూరు చేయాల్సిందిగా కర్నూ లు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ కోరగా నిధులను మంజూరు చేస్తామని ఉప ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.
దేవాలయ సముదాయ భవన నిర్మాణ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసన సభ్యులు హఫీజ్ ఖాన్, పత్తికొండ శాసన సభ్యులు కంగాటి శ్రీదేవి, కోడుమూరు శాసన సభ్యులు జె. సుధాకర్, నగర మేయర్ బి.వై.రామయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ హరి జవహర్ లాల్, డిప్యూటీ కమిషనర్ రాణా ప్రతాప్,అసిస్టెంట్ కమిషనర్ లు ఆది శేష నాయుడు, వాణి, రామాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.