తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద నీరు
తుంగభద్ర డ్యామ్ కు పెరిగిన వరద నీరు
హోలగుంద :
కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు జీవనాడిగా ఉన్న తుంగభద్ర డ్యాం లో శుక్రవారం నీటి ప్రవాహం పెరిగింది డ్యాం పై భాగంలోని శివమొగ్గ తీర్థ హల్లి మోరాల్ దావనగిరి తదితర భాగంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి డ్యాం లో ఇన్ఫ్లో 16 వేల 40 క్యూసెక్కుల నీరు ప్రవహిస్తున్నాయి. అవుట్ ఫ్లో 149 సెక్స్ మాత్రమే ఉంది డ్యామ్లో ఇప్పటికీ 14 టిఎంసిల నీరు నిల్వ ఉన్నాయి ఆర్ బి సి కి 146 క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉండగా ఎల్ బి ఎం సి నీరు విడుదల చేయలేదు డ్యాం పూర్తి స్థాయి నీటిమట్టం 1633 అడుగులు కాగా డ్యాం లో వరద నీరు చేరుతుండటంతో ఆయకట్టు రైతుల్లో ఆనందం వెల్లివిరిసింది ముందస్తుగా నీరు రావడం వల్ల సాగు తాగునీటి ఇబ్బందులు తొలగనున్నాయి అని ఆయకట్టు రైతులు ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఖరీఫ్ సీజన్ కు ముందే డ్యాం లో నీటి ప్రవాహం ప్రారంభమైంది.