దేవస్థాన భవనాల పరిశీలన
దేవస్థాన భవనాల పరిశీలన
శ్రీశైలం, మే 26, (సీమకిరణం న్యూస్) :
దేవస్థానం పరిధిలో గల చల్లా వెంకయ్య సత్రం పెద్ద సత్రం పొన్నూరు సత్రం, దేవ స్థాన వైద్యశాలను ధర్మకర్తల మండలి చైర్మన్ రెడ్డివారి చక్రపాణి రెడ్డి పరిశీలించారు ఈ ప్రాంతాల్లోని స్థానికులతో మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. అన్ని భవనాల్లో కూడా ఎలక్ట్రికల్ వైరింగ్ పరిశీలించి అవసరమైతే మరమ్మతులు చెయ్యాలని ఇంజనీరింగ్ విభాగాన్ని ఆదేశించారు. తరువాత శ్రీ లలితాంబికా వాణిజ్య సముదాయాన్ని పరిశీలించారు. అనంతరం దేవస్థానం అధికారులు కూడా ధర్మకర్తల మండలి అధ్యక్షులు పరిశీలించి వైద్యశాలలో చేపడుతున్న వైద్య పరీక్షలు వైద్యశాలలు అందుబాటులో ఉన్న వైద్య పరికరాలు రోజువారీగా వచ్చే ఓపి పేషెంట్ల వివరాలు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారికి ఎటువంటి ఆలస్యం లేకుండా తగిన వైద్యాన్ని అందించాలని వైద్యులు సూచించారు. ఈ పరిశీలనలో ధర్మకర్తల మండలి అధ్యక్షులతో పాటు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మురళి బాలకృష్ణ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరెడ్డి పర్యవేక్షకులు మల్లికార్జున్రెడ్డి పాల్గొన్నారు