మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభo
-: ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.
మెగా క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభo
-: ఏపీ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి.
పాములపాడు :
మండల కేంద్రమైన పాముల పాడు లోని ఏఎన్ఆర్ జడ్పి ఉన్నత పాఠశాలలో టి ఎన్ ఆర్ కన్స్ట్రక్షన్ అధినేత టీ నాగరాజు మెగా క్రికెట్ టోర్న మెంట్ ను నిర్వహిస్తున్నారు గురువారం టోర్నమెంట్ ప్రారం భోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొ న్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలు ఎంతో అవసరమని క్రీడలతో మానసిక ఉత్సాహం ధైర్యంతో పాటు గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో క్రీడల నైపుణ్యాన్ని వెలికి తీయడం, వారి ప్రతిభను జిల్లా రాష్ట్ర స్థాయిలో పాల్గొనేందుకు వీలు ఉంటుందని ఆయన తెలి పారు. క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తాను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ గా ఎన్నికైన తర్వాత క్రీడలను వెలికితీసేందుకు 1600 వేసవి క్రీడల శిక్షణ శిబిరాలను ఏర్పా టు చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కూడా క్రీడల అభివృద్ధికి కృషి చేస్తున్నారని స్పోర్ట్స్ కోటా కింద సచివాలయ ఉద్యోగాల్లో 2500 మంది ని తీసుకోవడం జరిగిందని ఆయన తెలిపారు. అనంతరం టి ఎన్ ఆర్ కన్స్ట్ర క్షన్ అధినేత నాగరాజు మాట్లా డుతూ గ్రామీణ యువకులు మరియు విద్యార్థుల క్రీడా నైపుణ్యాన్ని పెంపొందిం చేందుకు ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుందని మండలకేంద్రమైన పాముల పాడు లో కాకుండా మండలం లోని గ్రామాల్లో ఎంతోమంది క్రీడాకారులు ఉన్నారని పాములపాడులో ఇండోర్ స్టేడియం నిర్మిస్తే ఇంకా క్రీడల్లో ఎక్కువగా రాణిస్తారని బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి సహకరించాలని వారికి వినతి పత్రం ఇచ్చారు, అనంతరం క్రికెట్ టోర్నమెంట్ ను బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నందికొట్కూరు మున్సిపల్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మార్కెట్ యార్డ్ చైర్మన్ మల్లారెడ్డి, రిటైర్డ్ పిడి లక్ష్మి రెడ్డ, బ్యాడ్మింటన్ రాష్ట్ర మాజీ క్రీడాకారుడు హనుమంతు రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.