నంద్యాలలో ఈనెల 13న భారీ ఉచిత వైద్య శిబిరం
నంద్యాల ప్రతినిధి, మార్చి 11, (సీమకిరణం న్యూస్) :
నంద్యాల సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆధ్వర్యంలో ఆసుపత్రి నిర్వాహకులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, డాక్టర్ లక్ష్మీప్రసన్న నిర్వహణలో, నంద్యాల ఐఎంఏ సహకారంతో ఈనెల 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి షుగరు, బిపి, గుండె, మూత్రపిండాల జబ్బుల ఉచిత వైద్య శిబిరం, సంజీవ నగర్ డెనియల్ పురం గేటు దగ్గర ఉన్న సాయి బాలాజీ నర్సింగ్ హోమ్ ఆవరణలో నిర్వహిస్తున్నట్లు డాక్టర్ హరినాథరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఆసుపత్రి లో జరిగిన విలేకరుల సమావేశంలో డాక్టర్లు హరినాథరెడ్డి, రవికృష్ణ మాట్లాడుతూ ఈ శిబిరంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ హరినాథ్ రెడ్డి, స్త్రీ వ్యాధి నిపుణురాలు డాక్టర్ లక్ష్మీప్రసన్న, ప్రముఖ గుండెజబ్బుల నిపుణులు డాక్టర్ మురళీ కృష్ణ, మూత్రపిండ వ్యాధుల నిపుణులు డాక్టర్ సాయి హరీషా రెడ్డి, షుగర్ వ్యాధి నిపుణులు డాక్టర్ వివేకానంద రెడ్డి, ఎముకలు కీళ్ల వ్యాధుల నిపుణులు డాక్టర్ దిలీప్ కుమార్ రెడ్డి, శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ శంకర్ తేజ రెడ్డి మరియు డాక్టర్ రమణారెడ్డి, డాక్టర్ శేషగిరి పాల్గొని రోగులను పరీక్షించి అవసరమైన రక్త పరీక్షలు, గుండె స్కానింగ్ పరీక్షలు చేసి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు.
ఈ అవకాశాన్ని నంద్యాల పట్టణం పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు. ఈ సందర్బంగా వైద్య శిభిరానికి సంబందించిన కరపత్రాలను విడుదల చేశారు.