ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో బీఎస్పీ
ఆత్మకూరు ఉప ఎన్నికల బరిలో బీఎస్పీ
నెల్లూరు, ఆత్మకూరు, జూన్ 04, (సీమకిరణం న్యూస్) :
నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఉపఎన్నికలో జాతీయ పార్టీ బీఎస్పీ తరఫున నందా. ఓబులేసు నామినేషన్ దాఖలు చేశారు.
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ప్రముఖ న్యాయవాది గా ఉన్న నందా. ఓబులేసు బిఎస్పి పార్టీ ఆత్మకూరు ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆత్మకూరు ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆ పార్టీ నిర్ణయించడంతో వారి రాష్ట్ర అధ్యక్షులు జిల్లా నేతల ఆధ్వర్యంలో ఆత్మకూరు లో ఓబులేసు నామినేషన్ దాఖలు చేశారు. తొలుత పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ నుండి నామినేషన్ వేసే ఆర్డిఓ కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆత్మకూరు ఇన్చార్జ్ మరియు ఆ పార్టీ అభ్యర్థి ఓబులేసు మాట్లాడుతూ ప్రజా సమస్యల పట్ల తమ పార్టీ చురుకుగా పని చేస్తుందని బడుగు బలహీన వర్గాలకు తాము అండగా ఉంటున్నామని స్థానికుడైన తనను గెలిపిస్తే స్థానిక ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండి సమస్యలు తీర్చేందుకు పూర్తిగా కృషి చేస్తానని తెలిపారు.. గతంలో శాసనసభ్యులు మంత్రిగా ఉన్న దివంగత మేకపాటి గౌతమ్ రెడ్డి ఆత్మకూరు నియోజకవర్గానికి ఎటువంటి అభివృద్ధి చేయలేదని అలాంటప్పుడు వారి ఆశయ సాధన కోసమంటూ వారి సోదరుడు విక్రమ్ రెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికి రావడం విచిత్రంగా ఉందని వ్యాఖ్యానించారు.. వీరి వెంట ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మరియు జిల్లా స్థానిక నేతలు హాజరయ్యారు….