ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSTATE

మైలవరంలో గడప గడపకు మన ప్రభుత్వం

మైలవరం నియోజకవర్గంలో గడప గడపకు మన ప్రభుత్వం

పాల్గొన్న మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్

శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారికి చిరుజల్లుల ఘనస్వాగతం

వరుణ దేవుని చల్లని ఆశీస్సులతో ఓబుళాపురంలో కన్నుల పండువగా గడప గడపకు మన ప్రభుత్వం

విదేశీ పర్యటన కారణంగా గడప గడపకు మన ప్రభుత్వం కొంత ఆలస్యమైంది

ఇకపై నిరంతరాయంగా గడప గడపకు మన ప్రభుత్వం

శాసనసభ్యులు కృష్ణప్రసాద్ వెల్లడి

రెడ్డిగూడెం, జూన్ 17, (సీమకిరణం న్యూస్) :

ఇచ్చిన మాట ప్రకారం ఎన్నికల హామీలను సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచే  ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌ మోహన్ రెడ్డి అమలు చేస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ అన్నారు. వరుణదేవుని చల్లని ఆశీస్సులతో భారీ జన సందోహం నడుమ రెడ్డిగూడెం మండలంలోని ఓబుళాపురం గ్రామంలో కన్నులపండువగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం శుక్రవారం ప్రారంభమైంది. శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారికి చిరుజల్లులు ఘనస్వాగతం పలికాయి. ముందుగా ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకుని కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మేకా కనకదుర్గ గారి కుటుంబానికి గడచిన మూడేళ్లలో రూ.1,18,000లు లబ్ది చేకూరిన విషయాన్ని శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు తెలియజేశారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లతో సహా ప్రతి వీధిలో ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు గురించి, ఆయా కుటుంబాలకు జరిగిన లబ్ది గురించి వివరించారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు కృష్ణ ప్రసాద్  మాట్లాడుతూ గడచిన మూడేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశామని, నాడు – నేడు ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టామని, మేం ఏం చేశామో ధైర్యంగా ప్రజలకు చెప్పగలుగుతున్నామన్నారు. ఇంకా ఎవరికైనా సరే అర్హత ఉండి సంక్షేమ పథకాలు రాని వారు ఉన్నారో వారిని గుర్తించి, దానికి గల కారణాలు తెలుసుకొని వారికి కూడా ఆయా పథకాలు వర్తింప చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కుల, మత, రాజకీయాలకు, పార్టీలకు, వర్గాలకు అతీతంగా సంక్షేమ పథకాలను పక్కాగా అమలు చేస్తున్నాం కాబట్టే తాము ధైర్యంగా ప్రజల్లోకి వెళ్తున్నామని శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాద్ గారు స్పష్టం చేశారు. సంక్షేమ పథకాలు సరిగా అందుతున్నాయా? లేదా? ఇంకా ఎవరికైనా అందజేయాలా? అని తెలుసుకోవడానికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి ఇంటికి వెళ్లాలని  ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి  సూచించినట్లు తెలిపారు. విదేశీ పర్యటనలో ఉండబట్టే గడప గడపకు మన ప్రభుత్వం మైలవరం నియోజకవర్గంలో కొంత ఆలస్యమైందన్నారు. ఇకపై నిరంతరాయంగా గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కొనసాగుతుందని శాసనసభ్యులు కృష్ణప్రసాద్ స్పష్టం చేశారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!