
క్రికెట్ కిట్లు పంపిణీ
చాగలమర్రి , జూన్ 16, (సీమకిరణం న్యూస్):
మండల పరిధిలోని పెద్ద వంగలి గ్రామానికి చెందిన యువకులకు క్రికెట్ కిట్ లను నియోజకవర్గ బిజేపి ఇంచార్జ్ భూమా కిషోర్ రెడ్డి గురువారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ యువత చదువుతోపాటు క్రీడా నైపుణ్యాలు కలిగి ఉండాలన్నారు. అప్పుడే చదివిన చదువుకు సార్థకత లభిస్తుందన్నారు. క్రీడలు కూడా ఉద్యోగాలకు దోహదపడుతాయి అన్నారు. ఈ పంపిణీ కార్యక్రమంలో ఓబయ్య, పాల షరీఫ్, రామనాధ రెడ్డి, హరిచంద్రా రెడ్డి తదితరులు పాల్గొన్నారు