26న ఏ ఐ వి ఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం

26న ఏ ఐ వి ఎఫ్ జాతీయ కార్యవర్గ సమావేశం
…. ఏ ఐ వి ఎఫ్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరీ దేవి
…. వ్యవస్థాపకులు జైన్ కుమార్
కర్నూలు టౌన్, జూన్ 22, (సీమకిరణం న్యూస్) :
ఈనెల 26వ తేదీ నగరంలోని మౌర్య ఇన్ సమావేశ భవనంలో ఆలిండియా శ్రీ విరాట్ విశ్వకర్మ విమెన్ అండ్ యూత్ ఫెడరేషన్ జాతీయ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఏఐవిఎఫ్ వ్యవస్థాపకురాలు రాజేశ్వరి దేవి, వ్యవస్థాపకులు జైన్ కుమార్ తెలిపారు. బుధవారం సమాచారశాఖ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ ఈ సమావేశానికి వివిధ రాష్ట్రాల నుంచి ముఖ్య అతిథులు హాజరవుతారని అన్నారు. ఈ సమావేశంలో జాతీయ స్థాయిలో విశ్వ బ్రాహ్మణులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చ కొనసాగుతుందని అన్నారు. వివిధ విభాగాలకు చెందిన వారికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. సేవ చేయాలన్న తపన ఉన్న విశ్వబ్రాహ్మణులు విశ్వకర్మలు మహిళలు ,యువకులు హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి బిజెపి నాయకులు తెలంగాణ ఓ బి సి కమిటీ మెంబర్ తల్లోజు ఆచారి, ఒరిస్సా నుండి ఆచార్య నాగ వరప్రసాద్, తమిళనాడు నుండి దయాకర్ ఆచార్య, తిరుమల తిరుపతి దేవస్థానం నుండి ఆదిత్య శర్మ పాల్గొంటారని తెలిపారు. మరిన్ని వివరాలు కావాలనుకునేవారు రాజేశ్వరి దేవి,9392509808 , జైన్ కుమార్ 9666604375 నెంబర్లకు ఫోన్ ద్వారా విశ్వబ్రాహ్మణులు సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సమావేశాన్ని జయప్రదం చేసేందుకు పెద్ద ఎత్తున విశ్వబ్రాహ్మణులు ,విశ్వకర్మలు రావాలని పిలుపునిచ్చారు. విలేఖర్ల సమావేశంలో మదన్మోహన్ ఆచారి, మహంకాళి బ్రహ్మం తులసయ్య , బ్రహ్మయ్య , విశ్వబ్రాహ్మణ లో పాల్గొన్నారు .