
ఘనంగా దొరసానమ్మ నెలసరి ఫాతిహా
నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, మార్చి 11, (సీమకిరణం న్యూస్) :
ఏఎస్ పేట రహ్మతాబాద్ మండల కేంద్రంలో వెలసి ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజ్రత్ సయ్యద్ ఖాజా రహంతుల్లా నాయబ్ రసూల్ మా హబీబా (దొరసానమ్మ) నెలసరి ఫాతిహను దర్గా ఉప పీఠాధిపతి ఎస్ జి ఎన్ జూనేద్ పాష ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రికి భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రత్యేక సాలాములు భక్తి కీర్తనలు పాడి ఖురాన్ ఖనీ ఫాతిహ చదివారు అనంతరం హజరత్ వారి సమాధులపై పూల దుప్పట్లు చద్దర్ లు ఎక్కించి ప్రత్యేక సలాములు పాడారు అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు పంచిపెట్టారు ఫాతిహ శుక్రవారం కలిసి రావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ సందర్భంగా ఉప పీఠాధిపతి మాట్లాడుతూ ప్రతి నెల ఉర్దూ కాలమాన ప్రకారం 7వ తేదీ దొరసానమ్మ 25 వ తేదీ హజరత్ వారి ఫాతిహాలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో ఆస్థాన నా తీయ గాయకులు షేక్ సంధాని భాష దర్గా అకౌంటెంట్ షేక్ ఖాజా హుస్సేన్ ఇతర దర్గా సిబ్బంది పాల్గొన్నారు