జర్నలిస్టు పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలి
– స్పందనలో ఏపియుడబ్లూజే వినతి
కర్నూలు టౌన్, జూలై 05, (సీమకిరణం న్యూస్) :
కర్నూల్ జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో 60 శాతం ఫీజు రాయితీ ఇస్తూ వస్తున్నారని, ఈ ఏడాది కూడా జర్నలిస్టుల పిల్లలకు కొనసాగించాలని ఏపియుడబ్ల్యుజే జిల్లా అడ హక్ కమిటీ కన్వీనర్ ఈ.ఎన్.రాజు, సీనియర్ జర్నలిస్ట్ కృష్ణా రెడ్డి, అడ హక్ కమిటీ సభ్యులు శ్రీనివాసులు గౌడ్, హరికిషన్ డిమాండ్ చేశారు. జర్నలిస్టు పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో 60 శాతం ఫీజు రాయితీ కొనసాగించాలని డిమాండ్ చేస్తూ.. సోమవారం స్పందన లో జర్నలిస్టులు డిఆర్వో ను కలిసి వినతపత్రం అందజేశారు. ఈ సంద్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో చాలా మంది జర్నలిస్టులు చాలీ, చాలని వేతనాలతో జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రజల సమస్యలను పాలకుల దృష్టికి తీసుకెల్లెందుకు నిరంతరం పని చేస్తున్నారని అన్నారు. ఆర్థికంగా జర్నలిస్టులు పడుతున్న ఇబ్బందులు చూసి గతంలో పని చేసిన కలెక్టర్లు జిల్లాలోని జర్నలిస్టుల పిల్లలకు ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో మొత్తం ఫీజు లో 60 శాతం రాయితీ ఇవ్వాలని ఆదేశాలు ఇవ్వటం జరిగిందన్నారు. దీంతో గత కొన్నేళ్లుగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో జర్నలిస్టుల పిల్లలకు 60 శాతం ఫీజు రాయితీ ఇస్తూ వస్తున్నారన్నారు. అయితే ఈ ఏడాది కొన్ని స్కూల్స్ యాజమాన్యాలు మాకు ఈ ఏడాది ఎలాంటి ఆదేశాలు రాలేదని, ఫీజు రాయితీ ఇవ్వలేమని చెబుతున్నని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కనుక దయామయులైన తమరు గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ లో జర్నలిస్టు పిల్లలకు మొత్తం ఫీజు లో 60 శాతం రాయితీ ఇచ్చే విధంగా ప్రైవేట్, కార్పొరేట్ స్కూల్స్ యాజమాన్యాలకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. తమ విన్నపాన్ని మన్నించి గతంలో మాదిరిగానే ఈ ఏడాది కూడా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపియుడబ్ల్యుజే నాయకులు కొండా శీను, దస్తగిరి, అంజి, రఘు, వెంకటేష్, హరి తదితరులు పాల్గొన్నారు.