ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
దళిత గిరిజన మైనార్టీ ప్రజలపై దాడులు జరగడం
సిగ్గుచేటు
జిల్లాలో అత్యాచార నిరోధక చట్టం సక్రమంగా అమలు చేయాలి
ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి
జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు యం.యం.డి.ఇమామ్
ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల ర్యాలీ కు మద్దతుగా హాజరైన యం.యం.డి.ఇమామ్
అనంతపురం టౌన్, అక్టోబర్ 14, (సీమకిరణం న్యూస్):
దళిత గిరిజన మైనార్టీ ప్రజలపై దాడులు జరుగుతుండడం
సిగ్గుచేటని అలాగే జిల్లాలో అత్యాచార నిరోధక చట్టం సక్రమంగా అమలు చేయాలని
జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు యం.యం.డి.ఇమామ్ తెలిపారు. అనంతపురం జిల్లా నందు ఎస్సీ, ఎస్టీ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన ర్యాలీ కు మద్దతుగా జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు యం.యం.డి.ఇమామ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం స్థానిక అంబేద్కర్ భవన్ నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు సాగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ మరియు మానిటరింగ్ కమిటీ సభ్యులు యం.యం.డి.ఇమామ్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయిన దేశంలో దళిత, గిరిజన, మైనార్టీ ప్రజలపై ప్రతి 15 నిమిషాలకు ఒక అత్యాచారం, ప్రతిరోజు సగటున ఆరుగురు మహిళలు మానభంగానికి గురవుతున్న సంఘటనలు జరుగుతుండడం చాలా బాధాకరం. ఎన్ని చట్టాలున్న కుల వివక్షతతో దళిత గిరిజన మైనార్టీ ప్రజలపై దాడులు జరుగుతుండడం సిగ్గుచేటు, జిల్లాలో అత్యాచార నిరోధక చట్టం సక్రమంగా అమలు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీలపై జరుగుతున్న దాడులను అరికట్టాలి, 41ఏ సిఆర్పిసి నోటీసులు రద్దుచేసి స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా చూడాలి, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి అంటూ తన అవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ, ప్రజా సంఘాలు, ముస్లిం మైనార్టీ సంఘాలు, మహిళా సంఘాలు, విద్యార్థి, ఉద్యోగ సంఘాలు పాల్గొన్నారు.