విచారణ జరిపి చట్టపరంగా న్యాయం చేస్తాం : జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్
స్పందన కార్యక్రమానికి 101 ఫిర్యాదులు
స్పందన కార్యక్రమం ద్వారా స్వీకరించిన ఫిర్యాదుల పై త్వరితగతిన స్పందించి , పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్, ఏప్రిల్ 17, (సీమకిరణం న్యూస్):
జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ సోమవారం స్పందన కార్యక్రమం నిర్వహించారు.
జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి స్పందన కార్యక్రమంకు వచ్చిన ప్రజల సమస్యల వినతులను స్వీకరించి ఫిర్యాది దారులతో జిల్లా ఎస్పీ మాట్లాడి వారి యొక్క సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
స్పందన కార్యక్రమానికి ఈ రోజు మొత్తం 101 ఫిర్యాదులు వచ్చాయి.
వచ్చిన ఫిర్యాదుల్లో కొన్ని …
1) ఫిజికల్ టీచర్ ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొందరు వ్యక్తులు మోసం చేశారని కర్నూలు పాతబస్తి కి చెందిన రమీజాబి ఫిర్యాదు చేశారు.
2) ఆన్ లైన్ మీ షో యాప్ లో మీకు 11 లక్షల రూపాయల ఫస్ట్ ప్రైజ్ గిఫ్ట్ తగిలిందని ఆ గిప్ట్ పంపించాలంటే సర్వీస్ చార్జీలు, జిఎస్టీ , పలు రకాల ఫీజుల పేర్లతో మొత్తం 4 లక్షల 80 వేలు కట్టించుకుని గిఫ్ట్ ను మీ అడ్రస్ కు పంపిస్తామని చెప్పి ఫోన్ లో మాట్లాడి మోసం చేసిన వారి పై చర్యలు తీసుకోవాలని మిలిటరి కాలనీ, భూపాల్ నగర్ , కర్నూలుకు చెందిన చిన్న స్వాములు ఫిర్యాదు చేశారు.
3) నా భర్త కుటుంబ సభ్యుల నుండి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చర్యలు తీసుకోవాలని కర్నూలు కు చెందిన ఉజ్వల ఫిర్యాదు చేశారు.
5) ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పి తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని కర్నూల్ రాజీవ్ నగర్ చెందిన మహానంది ఫిర్యాదు చేశారు.
6) కొందరు వ్యక్తులు నా గురించి సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని పత్తికొండకు చెందిన వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు.
స్పందన కార్యక్రమానికి వచ్చిన ఫిర్యాదులన్నింటిపై చట్ట ప్రకారం విచారణ జరిపి, బాధితులకు న్యాయం చేస్తామని, సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని ఈ సంధర్భంగా జిల్లా ఎస్పీ జి. కృష్ణ కాంత్ ఐపియస్ హామీ ఇచ్చారు. ఈ స్పందన కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ డి. ప్రసాద్ , స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ వెంకటాద్రి, లీగల్ అడ్వైజర్ మల్లికార్జున రావు పాల్గొన్నారు.