కస్తూర్బా పాఠశాలను పరిశీలించిన సమగ్ర శిక్ష గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్
గోనెగండ్ల , ఏప్రిల్ 17 , ( సీమకిరణం న్యూస్ ) :
కస్తూరిబా బాలికల పాఠశాలను సమగ్ర శిక్ష గర్ల్స్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సునీత సందర్శించారు. ఆమె మాట్లాడుతూ కస్తూరిబా బాలికల పాఠశాల నందు ఇంటర్ విద్య ఎంపీసీ కొరకు మొత్తం 40 సీట్లు ఉన్నాయని కావున పదవ తరగతి పూర్తి చేసిన విద్యార్థులు అప్లై చేసుకోవాలని సూచించారు పాఠశాల నందు టీచర్ల పాఠ్యప్రణాళికలు మరియు బోధించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు పాఠశాల నందు నీటి వసుతులపై ఆరా తీశారు పాఠశాలలో త్రాగునీటి కొరకు ఆరో ప్లాంట్ నందు గల వాటర్ తాగుతున్నామని విద్యార్థులు తెలియజేశారు మరియు ఇతర పనుల కొరకు ప్రత్యయం గా ఉన్న నీటి వనలను వినియోగిస్తున్నామని స్పెషల్ ఆఫీసర్ విద్యావతి తెలిపారు . ఈ కార్యక్రమంలో ఎస్ఓ విద్యావతి ఉపాధ్యాయులు మరియు సిఆర్పి తదితరులు పాల్గొన్నారు.