ANDHRASTATE

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ .. ఇది ప్రజల పార్టీ

వైయస్సార్ కాంగ్రెసు పార్టీ … ఇది ప్రజల పార్టీ

కోసిగి మండల ఇంచార్జ్ మురళీమోహన్ రెడ్డి

కోసిగి, మార్చి,12, (సీమకిరణం న్యూస్) :

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజన్న ఆశయాలు సాధించే పార్టీ,ఇది ప్రజల పార్టీ అని కోసిగి మండల ఇంచార్జ్ మురళీమోహన్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం మండల కేంద్రము కోసిగి లో ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి ఆదేశాల మేరకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా మురళీమోహన్ రెడ్డి పాల్గొన్నారు.ముందుగా వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి,నాడిగేని వీధిలో మరియు గాంధీ నగర్ నందు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసిన అనంతరం, ఆయన మాట్లాడుతూ,12వ వసంతంలోకి పార్టీ అడుగు పెడుతున్న తరుణంలో పార్టీకి అండగా నిలబడిన ప్రతి కార్యకర్త అగ్ని కణికై పార్టీ సిద్ధాంతాలను ప్రచారం చేసి ప్రజల్లో మమేకమై జగనన్నను సీఎంగా చూడాలని 2014లో ప్రయత్నించి విఫలం కాగా,మరింత కఠోరదీక్షతో 2019లో విజయ కేతనం ఎగుర వేసి,సియం జగనన్న  ప్రభుత్వంలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలుతో పాలన సౌలభ్యంలో కష్టపడిన ప్రతి కార్యకర్తను గుర్తించి,వారి సేవలతో  2024లో వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో సియంగా జగనన్నను, ఎమ్మెల్యేగా బాలనాగిరెడ్డిని విజయకేతనం కోసం కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయనచెప్పారు.ఈకార్యక్రమంలో మండల కన్వీనర్ బెట్టనగౌడ్, సీనియర్ నాయకులు నాడిగేని నరసింహులు,యంపీపీ ఈరన్న, మేజర్ గ్రామ సర్పంచ్ కుమారి అయ్యమ్మ,ఆర్లబండ సహకార సంఘం అధ్యక్షులు మహాంతేష్ స్వామి,మాజీ ఎంపీపీ బీమక్క, మాజీ జడ్పీటీసీ మంగమ్మ,కో ఆప్షన్ మెంబర్ సౌఖత్,మాణిక్య రాజు,వి వెంకటేష్,షంషుద్దీన్, ఉస్మాన్,యన్ నాగ రాజు,జగదీష్ స్వామి,కురువ మల్లయ్య, కోసిగయ్య,బండ్ల గోవిందు,దొడ్డి నర్సన్న,జంపాపురం బసిరెడ్డి, వందగల్లు లక్ష్మయ్య,దుద్ది నాగేష్,పెద్దబొంపల్లి భీమయ్య, ఆగసనూరు ఆకాష్,మాన్వి వెంకటేష్,ఆర్లబండ పరుశురాం, వివిధ గ్రామాల సర్పంచ్లు, యంపీటీసిలు మరియు వివిధ గ్రామాల నాయకులు,కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related Articles

Back to top button
error: Content is protected !!