ఎన్నికల నియమావళి ఉల్లంఘించిన ఏడు మంది వాలంటీర్లను తొలగింపు : ఎంపీడీవో
గోనెగండ్ల , మార్చి 20 , (సీమకిరణం న్యూస్) :
కర్నూలు జిల్లా గోనెగండ్ల మండల పరిధిలోని వేముగోడు గ్రామంలో మంగళవారం నాడు వైసీపీ నాయకులు చేపట్టినటువంటి మేము సిద్ధం మా బూతు సిద్ధం కార్యక్రమంలో గ్రామ వాలంటీర్లు పాల్గొని ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడం పట్ల, వారిపై వచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన అధికారులు ఏడు మంది వాలంటీర్లను తొలగించామని గోనెగండ్ల ఎంపీడీవో సోనీ బాయ్ తెలిపారు. దేశమంతటా ఎన్నికల కోడ్ అమలు ఉన్నందున ప్రభుత్వ ఉద్యోగులు వాలంటీర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని లేనిపక్షంలో ఎన్నికల నియమాలని ఉల్లంఘిస్తే ప్రభుత్వ ఉద్యోగులు అయితే సస్పెండ్ చేస్తామని గ్రామ వాలంటీర్ అయితే తొలగించి క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామని హెచ్చరించారు.