BREAKING NEWSPOLITICSSTATE
కేఈ శ్యామ్ బాబుకు ఘన స్వాగతం

కేఈ శ్యామ్ బాబుకు ఘన స్వాగతం
భవిష్యత్తు గ్యారెంటీ బాబు సూపర్ 6 డోర్ టు డోర్ కార్యక్రమం
సూపర్ సిక్స్ పథకాలను వివరిస్తున్నకేఈ శ్యామ్ బాబు
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి , మార్చి 25, (సీమకిరణం న్యూస్) :


వెల్దుర్తి మండలంలోని ఎల్ నగరం, ఎల్ తాండ, దాసరి దొడ్డి, పుల్లగుమ్మి గ్రామాలలో పత్తికొండ నియోజకవర్గం తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యాంబాబు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాలలో కేఈ శ్యాం బాబుకు నాయకులు, ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటికి తిరుగుతూ సూపర్ సిక్స్ పథకాలను వివరించారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. దేశంలో ఎన్ డి ఏ కూటమే విజయ దుందుభి మోగిస్తుందన్నారు. కాబట్టి రాష్ట్ర అభివృద్ధికి ఎటువంటి డోకా ఉండదన్నారు. ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని ఈ సందర్భంగా ఓట్లను కోరారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.