ANDHRABREAKING NEWSPOLITICSSTATE
తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి

తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి
పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు
ఇంటింటికి ప్రచారంలో కేఈ శ్యామ్ బాబుకు బ్రహ్మరథం పట్టిన స్థానికులు
బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారెంటీ ( సూపర్ 6) పై విస్తృత ప్రచారం
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 01, (సీమకిరణం న్యూస్) :


2024 సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి ప్రతి ఒక్కరు సహకరించాలని పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు అన్నారు. సోమవారం క్రిష్ణగిరి మండలంలోని కొట్టాల, కొత్తూరు, తొగర్చేడు గ్రామాల్లో బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారెంటీ ( సూపర్ 6) పై కేఈ శ్యామ్ బాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. క్రిష్ణగిరి మండలంలోని కొట్టాల, కొత్తూరు, తొగర్చేడు గ్రామాల్లో కేఈ శ్యామ్ బాబుకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. బాబు సూపర్ సిక్స్ పథకాల గురించి ఇంటింటికి వెళ్లి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కేఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి అఖండ మెజారిటీ అందించాలని ఆయన అన్నారు. మహిళ, రైతు, యువత, వెనుకబడిన తరగతుల సాధికారత, బలోపేతంతోపాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పేదలను ధనికులుగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి ఏజెండా “బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ (బాబు సూపర్ 6)” మ్యానిఫెస్టో గురించి ప్రజలకు వివరించి, ప్రజలను చైతన్యవంతం చేసి, 2024లో టిడిపి అధికారంలోకి వచ్చాక “బాబు సూపర్ 6” లోని వాగ్దానాలను ఎటువంటి వివక్ష లేకుండా, నిబంధనలు విధించకుండా అమలు చేయడంతో పాటు మన రాష్ట్ర అభివృద్ధికి పాటు పడడానికి చంద్రబాబు నాయుడు కృషి చేస్తారని, ప్రతి ఒక్కరూ “బాబు సూపర్ 6” లోని పథకాలు అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాలన్నారు, ఈ కార్యక్రమంలో క్రిష్ణగిరి మండలం చెందిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు మరియు కొట్టాల,కొత్తూరు, తొగర్చేడు గ్రామ పంచాయితీ స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.