ANDHRABREAKING NEWSPOLITICSSTATE
2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం

2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం ఖాయం
పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు
ఇంటింటికి ప్రచారంలో కేఈ శ్యామ్ బాబుకు బ్రహ్మరథం పట్టిన స్థానికులు
బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారెంటీ ( సూపర్ 6) పై విస్తృత ప్రచారం
కర్నూలు ప్రతినిధి/ వెల్దుర్తి, ఏప్రిల్ 02, (సీమకిరణం న్యూస్) :


2024 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ చిత్తుచిత్తుగా ఓడిపోవడం ఖాయమని పత్తికొండ నియోజకవర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు అన్నారు. మంగళవారం క్రిష్ణగిరిలో బాబు ష్యూరిటి భవిష్యత్ గ్యారెంటీ ( సూపర్ 6) పై కేఈ శ్యామ్ బాబు విస్తృత ప్రచారం నిర్వహించారు. కేఈ శ్యామ్ బాబుకు స్థానికులు బ్రహ్మరథం పట్టారు. ఈ సందర్భంగా కేఈ శ్యామ్ బాబు మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ రెండు ఓట్లు సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఆయన అన్నారు. మహిళ, రైతు, యువత, వెనుకబడిన తరగతుల సాధికారత, బలోపేతంతో పాటు ఇతర సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతో పేదలను ధనికులుగా తీర్చిదిద్దడానికి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన తొలి ఎజెండా “బాబు ష్యూరిటీ – భవిష్యత్తుకు గ్యారెంటీ (బాబు సూపర్ 6)” మ్యానిఫెస్టో గురించి టీడీపీ శ్రేణులు ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో క్రిష్ణగిరి మండలం చెందిన తెలుగుదేశం పార్టీ, బీజేపీ నాయకులు, జనసేన నాయకులు మరియు క్రిష్ణగిరి పంచాయితీ గ్రామ స్థాయిల్లో వివిధ హోదాల్లో ఉన్నటువంటి నాయకులు, మహిళలు, కార్యకర్తలు, యువకులు పాల్గొన్నారు.