POLITICSSTATETELANGANAWORLD

ఇద్దరు ముద్దాయిలను ఓడించండి : ఆనం 

ఇద్దరు ముద్దాయిలను ఓడించండి : ఆనం

నెల్లూరు, ఆత్మకూరు, ఏఎస్ పేట, ఏప్రిల్ 16, (సీమకిరణం న్యూస్) :

వైసీపీ తరఫున పోటీ చేస్తున్న ఇద్దరు ముద్దాయిలైన విజయసాయి రెడ్డి, విక్రంరెడ్డిలను ఓడించాలని ఆత్మకూరు టిడిపి అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. ఆయన మంగళవారం ఏఎస్ పేట మండలంలోని గుంపర్లపాడు, గొల్లపేట, వేల్పులుగుంట, అక్బరాబాద్ గ్రామాలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆనంకు ఆయా గ్రామాల నాయకులు గజమాలలతో సత్కరిస్తూ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఎస్ పేట మండలంలోని గ్రామాల్లో గతంలో తాను చేసిన అభివృద్ధి తప్ప ఈ పది సంవత్సరాలలో మేకపాటి సోదరులు చేసిన అభివృద్ధి ఏమి లేదన్నారు. మండలంలో గతంలో తాను వేసిన రోడ్లు తాను తెచ్చిన ఐటిఐ కాలేజీ, ఆదర్శ పాఠశాల, మోడల్ స్కూల్, సబ్ స్టేషన్ లు తప్ప ఇతర అభివృద్ధి జరగలేదన్నారు పది సంవత్సరాలు ఇక్కడ ప్రాతినిధ్యం వహించిన మేకపాటి సోదరులు ఎలాంటి అభివృద్ధి చేయకపోగా ఈ ఎన్నికల్లో మళ్లీ కల్లీ బోల్లి కబుర్లు చెబుతూ ఓట్లు అడగడానికి వస్తున్నారని ప్రజలు ఆలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలన్నారు. ఎంపీగా చీప్ లిక్కర్ కేసులో దొరికిపోయి 16 నెలలు జైల్లో శిక్ష అనుభవించిన ఏ టు ముద్దాయి విజయసాయిరెడ్డి కావాలా లేదంటే తన సొంత నిధులతో ప్రతి గ్రామాల్లో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసి అందరికీ మంచినీళ్లు అందించిన అభివృద్ధి ప్రదాత కావాలో ఆలోచించుకోవాలన్నారు. అలాగే ఎమ్మెల్యేగా రోడ్లు వేయకుండానే వేసామని బిల్లులు చేసుకొని క్రిమినల్ కేసుల్లో ఉన్న విక్రం రెడ్డి కావాలో లేదంటే గతంలో ఈ ప్రాంతాన్ని ఎంతో అభివృద్ధి చేసి సోమశిల ఉత్తర కాలువను ఏఎస్ పేట మండలానికి అందించి నీటి కష్టాలను తీర్చిన తాను కావాలో మీరే ఆలోచించుకునే ఓటు వేయాలన్నారు. ప్రస్తుతం కొన్ని గ్రామాల్లో ఆయా గ్రామాల నాయకులు పలు సమస్యలను ఆనం దృష్టికి తీసుకెళ్లగా ఎమ్మెల్యేగా ప్రజలందరూ ఓట్లు వేసి ఆశీర్వదించినట్లయితే తప్పకుండా మీరు కోరిన ప్రతి పనిచేసే గ్రామాలను అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. రేపు జరగబోయే ఎన్నికల్లో ఎంపీగా విపిఆర్ ను ఎమ్మెల్యేగా తనను మీ అమూల్యమైన ఓట్లు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి ఆశీర్వదించాలన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు అబ్బూరు రమేష్ నాయుడు, టిడిపి నాయకులు కాటంరెడ్డి నరసింహారెడ్డి, నంది వివేకానంద రెడ్డి, పులిమి సుధాకర్ రెడ్డి, పెద్దబ్బీపురం సర్పంచ్ మాధవరెడ్డి, సిబివరం సర్పంచ్ నరసయ్య, మైనార్టీ నాయకులు ఖాజామియా, అఫ్జల్, నజీర్ పెద్ద ఎత్తున టిడిపి నాయకులు కార్యకర్తలు జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!