అట్టహాసంగా వైసిపి అభ్యర్థి ఆదిమూలపు సతీష్ నామినేషన్
కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 19, (సీమకిరణం న్యూస్):
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ వైసిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు, అశేష జన వాహిని మధ్య ఊరేగింపుగా వెళ్లి నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. శుక్రవారం కుడా చైర్మన్ కోట్ల హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో కోడుమూరు అసెంబ్లీ అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ కర్నూలు పట్టణంలోని స్థానిక ఆర్డిఓ కార్యాలయం లో ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీవో ఎం శేషిరెడ్డి వద్ద నామినేషన్ పత్రాలు అందజేశారు. శుక్రవారం ఉదయం కోడుమూరు నియోజకవర్గం నుంచి కోడుమూరు, గూడూరు,సి బెలగల్,కర్నూల్ రూరల్ మండలాల నుంచి వైసీపీ శ్రేణులు వంద లాది వాహనాల్లో నామినేషన్ కార్యక్రమానికి బయలుదేరి వెళ్లారు. నియోజకవర్గంలో నలుమూలల నుంచి వచ్చిన వైసీపీ శ్రేణులు కర్నూలు పట్టణంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ వద్ద నుంచి నామినేషన్ కార్యక్రమానికి భారీఎత్తున హాజరై ఊరేగింపుగా బయలుదేరి డప్పుచప్పులు, బాణసంచా పేల్చుతూ వైసిపి నాయకులు, కార్యకర్తల కేరింతల మధ్య ఎంతో అట్టహాసంగా నామినేషన్ కార్యక్రమం నిర్వహించారు. నామినేషన్ సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో వైసిపి నాయకులు కోట్ల హరిచక్రపాణరెడ్డి, కొత్త కోట ప్రకాష్ రెడ్డి,మాజీ ఎమ్మెల్యే మణిగాంధీ, జడ్పిటిసి రఘునాథరెడ్డి,మండల కన్వీనర్ రమేష్ నాయుడు తదితర వైసిపి నేతలు అభ్యర్థి డాక్టర్ ఆదిమూలపు సతీష్ తోపాటు కలిసి ఊరేగింపులో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కోడుమూరు వైసిపి నాయకులు సొసైటీ కన్వీనర్ కృష్ణారెడ్డి,గుంతకంటి మల్లారెడ్డి, రవి కుమార్ రెడ్డి,ప్రవీణ్ కుమార్, సాజిద్ అలీ, రాంపురం శివరాముడు, రాఘ వేంద్ర,లింగన్న,వార్డు సభ్యులు ఆకులరవి, వీరన్న,కౌలుట్ల, విష్ణు,వెంకటస్వామి,పాలకుర్తి నాగభూషణం రెడ్డి,రామకృష్ణారెడ్డి, వర్కూరు ఈశ్వర రెడ్డి, కృష్ణాపురం శ్రీనివాసరెడ్డి,విజయ్ కుమార్ రెడ్డి,గోరంట్ల మాధవ నాయుడు, పులకుర్తి నాగేంద్ర, వెంకటేశ్వర్లు, లద్దగిరి ఎంపీపీ దుబ్బన్న వైసిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.