ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

వైసీపీని మరోసారి ఆదరించాలి 

వైసీపీని మరోసారి ఆదరించాలి

పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

గోకులపాడు గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి

కర్నూలు ప్రతినిధి / వెల్దుర్తి, ఏప్రిల్ 20, (సీమకిరణం న్యూస్) :

పత్తికొండ నియోజకవర్గంలో ప్రజలు మరోసారి వైఎస్సార్సీపీని ఆదరించాలని పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి కోరారు. శనివారం క్రిష్ణగిరి మండల పరిధిలోని గోకులపాడు గ్రామంలో జడ్పీటీసీ సభ్యులు కేఈ సుభాషిని, ఎంపీపీ డాక్టర్ కంగాటి వెంకటరామిరెడ్డి, గ్రామ నాయకులతో కలిసి ఎమ్మెల్యే శ్రీదేవి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి కుటుంబసభ్యులను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు వివరిస్తూ కర పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి మాట్లాడుతూ నిష్పక్షపాతంగా,పారదర్శకంగా పరిపాలన సాగిస్తూ అన్ని వర్గాల ప్రజలకు మంచి చేసిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆదరించాలన్నారు. సీఎం జగనన్న కుల మత భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలందించారని, సీఎం గారి సహకారంతో గోకులపాడు గ్రామంలో హంద్రీ నదిపై బ్రిడ్జి పనులు మొదలు పెట్టామని తప్పకుండా దాన్ని పూర్తి చేసేది కూడా మా ప్రభుత్వమేనని ప్రజలకు గుర్తుచేశారు. గత టీడీపీ పాలన, ప్రస్తుత వైఎస్సార్ సీపీ పాలనలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను బేరీజు వేసుకోవాలని కోరారు. టిడిపి నాయకులు ఎన్నికలు రావడంతో ప్రజల ఇళ్ల వద్దకు వస్తున్నారని లేకపోతే వచ్చేవారే కాదన్నారు. పలు దఫాలుగా ప్రతి గడపకు వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని పరిష్కారానికి కృషి చేశానన్నారు. టిడిపి నాయకుల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని, నెరవేరని హామీలు ఎన్నైనా ఇచ్చే అలాంటి వారికి మరోసారి గట్టిగా బుద్ధి చెప్పాలన్నారు. పార్టీలు, కులమతాలకతీతంగా అందరి క్షేమం కోరుతూ సాగిన వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని, ఎమ్మెల్యే తనకు, ఎంపీగా బీవై రామయ్యకు రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకే వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోకులపాడు గ్రామం, క్రిష్ణగిరి మండలం వైఎస్ఆర్ పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు..

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!