- “సూపర్ సిక్స్” పథకాలతో టిడిపి విజయం తథ్యం
- వెల్దుర్తి మండల సీనియర్ నాయకులు సుబ్బారాయుడు
- సూపర్ సిక్స్ పథకాలపై విస్తృత ప్రచారం
- సూపర్ సిక్స్ పథకాలపై ప్రజల నుంచి విశేష స్పందన
- కర్నూలు ప్రతినిధి, వెల్దుర్తి, ఏప్రిల్ 22, (సీమకిరణం న్యూస్):
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర బాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ పథకాలతో వచ్చే ఎన్నికల్లో టీడీపీ విజయం తథ్యమని వెల్దుర్తి మండల సీనియర్ నాయకులు సుబ్బారాయుడు స్పష్టం చేశారు. సోమవారం వెల్దుర్తి మండలంలోని లక్ష్మీనగరం, దాసరదొడ్డి, తాండ, గోవర్ధనగిరి, ఎస్ పెరములా గ్రామలలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, వెల్దుర్తి టిడిపి మండల అధ్యక్షుడు బలరాం గౌడ్, మాజీ పార్టీ అధ్యక్షుడు జయ రాముడు, వెల్దుర్తి మండల తెలుగు యువత అధ్యక్షులు సుధాకర్ గౌడ్ తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు సుబ్బారాయుడు మాట్లాడుతూ సీఎం జగన్ పాలనలో అన్ని వ్యవస్థలు సర్వనాశనమయ్యాయని, ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. టీడీపీని గెలిపించేందుకు ప్రజలంతా సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుకు రెండు ఓట్లు వేయాలని ఒకటి కర్నూలు పార్లమెంట్ టిడిపి అభ్యర్థి బస్తిపాడు నాగరాజు మరియు పత్తికొండ టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబుకు రెండవ ఓటు వేసి ఇద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల టిడిపి నాయకులు, కార్యకర్తలు, బిజెపి నాయకులు కార్యకర్తలు జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.