ANDHRABREAKING NEWSCRIMEPOLITICSSPORTSSTATE

గ్రామల అభివృద్ధి టిడిపితోనే సాధ్యం

గ్రామల అభివృద్ధి టిడిపితోనే సాధ్యం

పత్తికొండ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు

కేఈ శ్యామ్ బాబు ఘన స్వాగతం పలికిన శ్రీరంగాపురం, గోవర్ధనగిరి, లక్ష్మీనగరం, రత్నపల్లి గ్రామ ప్రజలు

కర్నూలు ప్రతినిధి/వెల్దుర్తి మే 01, (సీమకిరణం న్యూస్) :

గ్రామల అభివృద్ధి తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని పత్తికొండ నియోజకవర్గం టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి కేఈ శ్యామ్ బాబు అన్నారు. బుధవారం వెల్దుర్తి మండల పరిధిలోని శ్రీరంగాపురం, గోవర్ధనగిరి, లక్ష్మీనగరం, రత్నపల్లి, గ్రామాలలో పర్యటించి రోడ్ షో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టినటువంటి సూపర్ సిక్స్ పథకాలు వాటి ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించడం జరిగింది. శ్రీరంగాపురం గ్రామంలో సీసీ రోడ్లు, గ్రామానికి రహదారి టిడిపి ప్రభుత్వం హయాంలోనే చేశామని అన్నారు. వేలకోట్ల నిధులు వెక్కించి పత్తికొండ నియోజకవర్గానికి చెరువుల నింపే కార్యక్రమాన్ని టిడిపి ప్రభుత్వంలోని శ్రీకారం చుట్టామని తెలిపారు. అయితే వైసిపి ప్రభుత్వం దీనిని అమలు పరిచే పనిలో విఫలం చెందిందని అన్నారు. అయితే ఎవరైతే మొదలుపెట్టారో వారి చేతుల మీదుగానే పూర్తి చేసే బాధ్యత ఆ భగవంతుడు మాకు అవకాశం ఇస్తున్నారని తెలియజేశారు. గోవర్ధనగిరి గ్రామంలో అన్ని చెరువులకు నీటిని మళ్లించే విధంగా తీసుకురావడం మా వంతు అని అన్నారు. జగన్ ప్రభుత్వంలో రైతులకు ఎటువంటి ఉపయోగం ఉండదని మనం సంపాదించుకున్న ఆస్తి జగన్ చేతిలో పెట్టాల్సి వస్తుందని ప్రజలకు వివరించారు. ఎక్కడ చూసినా గ్రామాలలో ఎటువంటి అభివృద్ధికి నోచుకోవడం లేదని ప్రతి ఒక్కరికి రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికి కొలాయి తీసుకొచ్చే బాధ్యత జాతీయ నాయకుడు నారా లోకేష్ బాధ్యత తీసుకున్నాడని ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి సీనియర్ నాయకులు బొమ్మిరెడ్డి పల్లె సుబ్బరాయుడు, మాజీ ఎంపీపీ జ్ఞానేశ్వర్ గౌడ్, టిడిపి మండల అధ్యక్షులు టి బలరాం గౌడ్, సూదేపల్లి జయరాముడు, బొమ్మన రమాకాంతరెడ్డి, చర్ల కొత్తూరు పుల్లయ్య, సుధాకర్ గౌడ్, ఎల్ బండ విజయ మోహన్ రెడ్డి, మహీధర్ రెడ్డి, రామచంద్రుడు, శ్రీరంగాపురం మాధవరావు, గోవర్ధనగిరి గోపాల్, వెల్దుర్తి హరి, ఎమ్మార్పీఎస్ గిడ్డయ్య, కలగుట్ల రామకృష్ణ, రామళ్లకోట ఆచారి, బోగల్ అమర్నాథ్ గౌడ్, రత్నపల్లె మోహన్ యాదవ్, మాదాపురం మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Seema Kiranam

SEEMA KIRANAM TELUGU DAILY NEWS... RNI REGISTRATION NUMBER... RNI : APTEL/2018/76380.... S.K. NAZEER. FOUNDER , EDITOR & PUBLISHER. SK PUBLICATIONS & MEDIA BROADCASTING INDIA PVT LTD. SEEMA KIRANAM TELUGU DIGITAL | KURNOOL | SK DIGITAL MEDIA | Telugu News | Latest News Online | Political News in Telugu | Andhra Pradesh Latest News | AP Political News | Telangana News | Telangana Politics News | Crime News | Sports News |

Related Articles

Back to top button
error: Content is protected !!