పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు నామకరణం చేయాలి
పల్నాడు జిల్లాకు గుర్రం జాషువా పేరు నామకరణం చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్
గుంటూరు, రెంటచింతల, మార్చి 14, (సీమకిరణం న్యూస్) :
నూతనంగా ఏర్పాటు చేయనున్న పల్నాడు జిల్లాకు కవికోకిల బిరుదాంకితుడైన వినుకొండ కు చెందిన గుర్రం జాషువా పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ సోమవారం ఎమ్మార్పీఎస్ ఎంఎస్పీ ఆధ్వర్యంలో రెంటచింతలలో నేతలు,కార్యకర్తలు రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. రిలే నిరాహార దీక్షలను ఎం సిపిఐ యు జిల్లా నాయకులు మాచవరపు నాగేశ్వరావు ప్రారంభించి మాట్లాడారు. తన కవిత్వం ద్వారా సామాజిక రుగ్మతలను పారద్రోలేందుకు విశేష కృషి చేసిన దళిత కవి గుర్రం జాషువాను గౌరవించేలా ప్రభుత్వం నూతన జిల్లాకు ఆయన పేరు పెట్టడం సముచిత నిర్ణయంగా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రిలే నిరాహార దీక్షల్లో గడిపర్తి శ్రీనివాసరావు, కర్ర ముసలయ్య, ఏసయ్య, దావులూరి బాబు,ఎర్ర వెంకయ్య, మరియదాసు తదితరులు పాల్గొన్నారు.