BREAKING NEWSHEALTHSTATE
వైద్యరంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం
వైద్యరంగంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకం
కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి
సూపరింటెండెంట్ డా.సి.ప్రభాకర రెడ్డి
ఘనంగా ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవ వేడుకలు
కర్నూలు వైద్యం సెప్టెంబర్ 25, (సీమకిరణం న్యూస్) :
రోగికి మందులు అందజేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ సమస్య పరిష్కారమయ్యే వరకూ ప్రతి దశలోనూ ఫార్మసిస్టుల కీలక పాత్ర పోషిస్తున్నారని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి
సూపరింటెండెంట్ డా.సి.ప్రభాకర రెడ్డి కొనియాడారు. బుధవారం ఫార్మసిస్టుల దినోత్సవం పురస్కరించుకొని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రిలోని ఔషధశాల ఆవరణలో ప్రపంచ ఫార్మసిస్టుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సూపరింటెండెంట్ డా.సి.ప్రభాకర రెడ్డి ఫార్మసిస్టులతో కలిసి కేక్ కట్ చేసి
వారికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డా.సి.ప్రభాకర రెడ్డి మాట్లాడుతూ ఆసుపత్రిలో రోగులకు మందులు ఇచ్చే విషయంలో ఫార్మసిస్టుల పాత్ర కీలకమని అన్నారు. ఆసుపత్రికి ప్రతిరోజు 3800 మంది ఓపికి వస్తుంటారు, మరియు 1200 మంది ఐపిలో అడ్మిషన్ అవుతారు. వీరందరికీ మందులు ఇచ్చే విషయంలో ఫార్మసిస్టుల పాత్ర చాలా కీలకమైందని అని అన్నారు. ఆసుపత్రికి వచ్చే రోగులు మందులను చాలా నమ్మకంతో వాడితే ఏ వ్యాధైన త్వరగా తగ్గిపోతుందని తెలిపారు. మార్కెట్లోకి వచ్చే ప్రతి మందులు ఎన్నో సంవత్సరాల క్లినికల్ ట్రైల్స్ ( పరిశోధనలు) తర్వాత బయటకు వస్తాయి ఎంతో ఓపిక సహనంతో ఈ మందుల తయారీలో పాల్గొనే ప్రతి ఒక్క ఫార్మసిస్టులకు నా శుభాకాంక్షలు అన్నారు. ఈ కార్యక్రమానికి సి ఎస్ ఆర్ ఎమ్ ఓ,డా.వెంకటేశ్వరరావు, డ్రగ్స్ స్టోర్ మెడికల్ ఆఫీసర్, డా.శారద, ఫార్మసిస్టులు, కృష్ణ మోహన్ శర్మ, నరసప్ప, సత్యప్రసాద్, శ్రీనివాస్ రాజేష్, రిటైర్డ్ ఫార్మసిస్టు, నరసింహారావు, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.