శ్రీగంధం చెక్కుల చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
పెనుగొండ ఫారెస్ట్ ఆఫీస్ శ్రీగంధం చెక్కుల చోరీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
వీరి నుండీ రూ. 16 లక్షల విలువ చేసే శ్రీగంధం ఆయిల్ , 14 సంచులు శ్రీగంధం చెక్కలు, 4 సెల్ ఫోన్లు, రూ. 2,600 నగదు స్వాధీనం ( వీటన్నింటి విలువ రూ. 27 లక్షలు ఉంటుంది)
అనంతపురం కలెక్టరేట్, మార్చి 15,( సీమకిరణం న్యూస్) :
పెనుగొండ ఫారెస్ట్ ఆఫీస్ నందు శ్రీగంధం చెక్కుల చోరీ కేసులో మరో ఇద్దరిని 1. బాబాజాన్ A1, సెల్వకుమార్ A2 ను పెనుగొండ పోలీసులు అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 16 లక్షల విలువ చేసే శ్రీగంధం ఆయిల్ , 14 సంచులు శ్రీగంధం చెక్కలు, 4 సెల్ ఫోన్లు, రూ. 2,600 నగదు స్వాధీనం చేసుకున్నారు. ( వీటన్నింటి విలువ రూ. 27 లక్షలు ఉంటుంది). ఈ ఏడాది జనవరి 24న ఇదే కేసులో ఏడుగుర్ని అరెస్టు చేసి 68 సంచుల శ్రీగంధం చెక్కులు, రెండు ఐచర్ లారీలు, కారు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. పెనుకొండ ఫారెస్టు ఆఫీస్ లో చోరీ అయిన 92 శ్రీగంధం చెక్కుల సంచులు, శ్రీగంధం ఆయిల్ కేసులో తాజాగా స్వాధీనం చేసుకున్న వాటితో కలిపి 82 సంచులు శ్రీగంధం చెక్కలు, శ్రీగంధం ఆయిల్ స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS గారి ఆదేశాల మేరకు మంగళవారం పెనుగొండ డీఎస్పీ ఎన్ రమ్య మీడియాకు వివరాలు వెల్లడించారు.