
రహదారి భద్రతపై వాహనదారులకు అవగాహన సదస్సు
డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి
కర్నూలు క్రైమ్, జనవరి 23, (సీమకిరణం న్యూస్):
కర్నూలు నగరంలోని పాత బస్టాండ్ లో గల రాయలసీమ డ్రైవింగ్ స్కూల్లో జాతీయ రోడ్డు భద్రత 36వ మాసోత్సవాలు, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి ఆదేశాల మేరకు ఆర్టీవో పర్యవేక్షణలో ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ల ఆధ్వర్యంలో బుధవారం రాయలసీమ డ్రైవింగ్ స్కూల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సి సి బస్ యజమాన్యం, డ్రైవర్స్ మరియు క్లీనర్లు మ్యాక్సీ క్యాబ్ మరియు మోటార్ క్యాబ్ డ్రైవర్ల, ఆటో యూనియన్ నాయకులకు, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీట్ బెల్ట్ ధరించడం పై, డ్రంక్ అండ్ డ్రైవ్, ఓవర్లోడ్ పై, ఓవర్ స్పీడ్, డ్రైవర్లు ప్రయాణికుల పట్ల మర్యాదపై సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆర్టీవో భరత్ చవాన్, కర్నూల్ ట్రాఫిక్ సిఐ మనసురుద్దీన్, లు మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు నిర్వహించే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా వాహనదారులకు రహదారి భద్రతలో తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ద్విచక్ర వాహనదారులు, లైసెన్స్ కలిగి ఉండి మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి, నాలుగు చక్రాల వాహనాదారులు లైసెన్స్ కలిగి ఉండి తప్పనిసరిగా సీట్ బెల్ట్ ను ధరించాలి, వాహనాదారులు మద్యం సేవించి వాహనాలు నడపకూడదన్నారు. అధిక వేగం రాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమన్నారు, ముఖ్యంగా వాహనాదారులు సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ఎంతో ప్రమాదకరమన్నారు, అదేవిధంగా ఆటో రిక్షాలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని ఆటో డ్రైవర్లకు తెలియజేశారు. వాహనాదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఆర్ సి బుక్ ఇన్సూరెన్స్ పొల్యూషన్ తప్పనిసరిగా వాహనాల్లో ఉంచుకొని వాహనాలు నడపలనీ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీవో భరత్ చావన్, కర్నూల్ ట్రాఫిక్ సిఐ మన్సూరుద్దీన్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్ర కుమార్, ఎస్ నాగరాజ నాయక్, ఎం వి సుధాకర్ రెడ్డి, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు వి బాబు కిషోర్ ఎన్ గణేష్ బాబు, డాక్టర్ జెశన్ అహ్మద్, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుళ్లు చలపతి, వి విజయభాస్కర్, మరియు హోంగార్డులు, సూపర్ ట్రావెల్స్ యజమాని ఇబ్రహీం, అల్లా ట్రావెల్స్ యజమాని మహబూబ్ బాషా, సీసీ బస్ డ్రైవర్స్, సిఐటియు నాయకులు రవి, మైమూద్ ఆటో డ్రైవర్లు వాహనదారులు డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.