
రహదారి ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కే రవీంద్ర కుమార్, సుధాకర్ రెడ్డి
కర్నూలు సి క్యాంప్ సెంటర్ ఆటో స్టాండ్ లో 36వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలు
కర్నూలు క్రైమ్, జనవరి 25, (సీమకిరణం న్యూస్):
రహదారి ప్రయాణాల్లో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కే రవీంద్ర కుమార్, సుధాకర్ రెడ్డి లు తెలిపారు. కర్నూలు నగరం సి క్యాంప్ సెంటర్ ఆటో స్టాండ్ లో 36 వ జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎస్ శాంతకుమారి, ఆదేశాల మేరకు ఆర్టీవో భరత్ చావన్ ఆధ్వర్యంలో శనివారం సి క్యాంప్ సెంటర్ ఆటో స్టాండ్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కే రవీంద్ర కుమార్, సుధాకర్ రెడ్డి లు మాట్లాడుతూ జనవరి 16 నుండి ఫిబ్రవరి 15 వరకు జరగబోయే రోడ్డు భద్రత మాసోత్సవాల్లో భాగంగా రహదారి భద్రతలో తీసుకోవలసిన జాగ్రత్తలపై సూచనలను తెలియజేశారు. అనంతరం సి క్యాంప్ సెంటర్ ఆటో స్టాండ్ లో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత పై అవగాహన గూర్చి తెలియజేస్తూ ఆటోలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించరాదనీ తెలిపారు. ఆటో డ్రైవర్లు ప్రయాణికుల పట్ల మర్యాదగా నడుచుకోవాలని సూచించారు. ప్రయాణికులు ఆటోలో వస్తువులు మర్చిపోతే సంబంధించిన పోలీస్ స్టేషన్లో వాటిని ఇచ్చి నిజాయితీని చాటుకోవాలని తెలిపారు. ఆటోలను అధిక వేగం మరియు రాష్ డ్రైవింగ్ అత్యంత ప్రమాదకరమన్నారు. ఆటో వాహనాదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్ సి బుక్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, పర్మిట్, ఫిట్నెస్ సర్టిఫికెట్ ను తప్పనిసరిగా ఆటోలో ఉంచుకొని నడపాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు తెలిపారు. ద్విచక్ర వాహనదారులు, లైసెన్స్ కలిగి మోటార్ సైకిల్ నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. నాలుగు చక్రాల వాహనదారులు లైసెన్స్ కలిగి ఉండి తప్పనిసరిగా సీట్ బెల్ట్ ను ధరించాలి, మద్యం సేవించి వాహనాలు నడపరాదన్నారు. ముఖ్యంగా వాహనాదారులు సెల్ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపడం ఎంతో ప్రమాదకరమనీ వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు కె రవీంద్ర కుమార్, సుధాకర్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ హెడ్ కానిస్టేబుల్ విజయభాస్కర్, హోంగార్డులు ఆటో డ్రైవర్లు ఆటో యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.