
బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ ను అందుకున్న జిల్లా కలెక్టర్
కర్నూలు ప్రతినిధి, జనవరి 25, (సీమకిరణం న్యూస్) :
రాష్ర్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ గారి చేతుల మీదుగా బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ ను జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా అందుకున్నారు. శనివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జాతీయ ఓటర్ల దినోత్సవంలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ఈ అవార్డును అందుకున్నారు. బాపట్ల కలెక్టర్ గా 2024లో ఓటర్ల జాబితా తయారీ, సార్వత్రిక ఎన్నికల నిర్వహణ తదితర అంశాల్లో సమర్థవంతంగా పని చేసినందుకు ఎన్నికల కమిషన్ జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా ను బెస్ట్ ఎలెక్టోరల్ ప్రాక్టీసెస్ అవార్డ్ ను అందజేశారు.