
రాష్ట్రంలో వైద్య విద్య మార్పునకు తన వంతు కృషి చేస్తా
ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్
విజయవాడ/ కర్నూలు ప్రతినిధి, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్):


విజయవాడ, ఏప్రిల్ 25, (సీమకిరణం న్యూస్):
రాష్ట్రంలో వైద్య విద్య మార్పునకు తన వంతు కృషి చేస్తానని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీగా డాక్టర్ పి.చంద్రశేఖర్ పదవి బాధ్యతలు స్వీకరించారు. ముందుగా డాక్టర్ చంద్రశేఖర్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ సయ్యద్ అబ్దుల్ నజీర్ ను మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ వీసీగా డాక్టర్ పి.చంద్రశేఖర్ పదవి బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం తనపై నమ్మకం ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, మంత్రి నారా లోకేష్ కి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ గారికి కృతజ్ఞతలు తెలిపారు.