ప్రజలు కలిసి మెలిసి సోదరభావంతో మెలగాలి

ప్రజలు కలిసి మెలిసి సోదరభావంతో మెలగాలి
జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ , ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్
ఆదోని మత పెద్దలతో పిస్ కమిటి సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ, జాయింట్ కలెక్టర్
కర్నూలు క్రైమ్/ ఆదోని ప్రతినిధి, జూన్ 05, (సీమకిరణం న్యూస్):
ప్రజలు కలిసి మెలిసి సోదరభావంతో మెలగాలని, శాంతియుత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ , ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ లు తెలిపారు. ఈ నెల 7న బక్రీదు పండుగ సంధర్బంగా ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆదోని పట్టణంలో ని మున్సిపల్ కార్యాలయ సమావేశంలో వివిధ వర్గాలకు చెందిన సామాజిక మత పెద్దలతో జిల్లా ఎస్పీ, సబ్ కలెక్టర్ లు సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మాట్లాడుతూ కులమతాలకుతీతంగా పండుగలు జరుపుకుంటూ ఆదోని ప్రజలు సోదర భావంతో మెలిగి స్పూర్తిగా నిలవాలన్నారు. సోషల్ మిడియాలో వచ్చే వదంతులను , పుకార్లను ఎవరూ నమ్మకూడదని, షేర్ చేసే ముందు అందరూ ఆలోచించాలన్నారు. ఏ చిన్న సమస్య అయిన పోలీసుల దృష్టికి తీసుకువచ్చి పరిష్కరించుకోవాలన్నారు. ఏటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గట్టి భద్రతను పటిష్టం చేస్తామన్నారు. ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ పండుగల సంధర్భంగా వదంతులు, పుకార్లను నమ్మకూడదని తెలియజేయాల్సిన భాధ్యత మత పెద్దలదేనన్నారు. ఎవైనా ఆదోనికి సంబంధించిన వదంతుల ఘటనలను సోషల్ మిడియా, వాట్సాప్ గ్రూప్ లలో విడియోలను గాని, వార్తలను గాని ఎవరైనా షేర్ చేసే ముందు, పబ్లిస్ చేసే ముందు మిడియా వారు మా నోటిసుకి తీసుకువచ్చి విచారణ చేసుకొని పబ్లిస్ చేయాలన్నారు. మనోభావాలను గౌరవించుకోవాలన్నారు. పండుగలను ప్రశాంత వాతావరణంలో జరుపుకుంటూ అందరూ సహకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆదోని డిఎస్పీ హేమలత, మున్సిపల్ కమిషనర్ కృష్ణ, తహశీల్దార్ శివరాముడు, ఆదోని పట్టణ సిఐలు పి. నల్లప్ప , కె. శ్రీరామ్, రామలింగమయ్య, రాజశేఖర్ రెడ్డి మత పెద్దలు , తదితరులు పాల్గొన్నారు.