మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం

మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడుదాం
కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్
వనమహోత్సవం – 2025 కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటిన జిల్లా ఎస్పీ
కర్నూలు క్రైమ్, జూన్ 05, (సీమకిరణం న్యూస్):
జూన్ 5 వ తేది ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా గురువారం ఆదోని డిఎస్పీ కార్యాలయంలోని పోలీసు అతిథి గృహం ముందు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మొక్కను నాటారు. వనమహోత్సవం – 2025 కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి భవిష్యత్ తరాల కోసం పర్యావరణాన్ని కాపాడదామని , పర్యావరణాన్ని కాపాడుటలో ప్రతి ఒక్కరు తోడ్పాటును అందించాలని కోరారు.
ప్రాణవాయువు శాతాన్ని పెంచేందుకు, వర్షాలు పడేందుకు చెట్లు ఎంతగానో ఉపయోగపడ తాయని , పర్యావరణాన్ని పరిరక్షించడం సామాజిక బాధ్యతగా భావించి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదోని డిఎస్పీ హేమలత, ఆదోని పట్టణ సిఐలు పి. నల్లప్ప , కె. శ్రీరామ్, రామలింగమయ్య, రాజశేఖర్ రెడ్డి , ఎస్సైలు పాల్గొన్నారు.