
పారిశుద్ధ్యం లోపిస్తే తనిఖీదారులదే బాధ్యత
నగరపాలక అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ
కర్నూలు కార్పొరేషన్, జూన్ 05, (సీమకిరణం న్యూస్):
కర్నూలు నగరంలో ఎక్కడైనా పారిశుద్ధ్యం లోపిస్తే సంబంధిత శానిటేషన్ డివిజన్ తనిఖీదారుడిదే బాధ్యత వహించాల్సి ఉంటుందని నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ అన్నారు. గురువారం ఆయన శరీన్ నగర్లో పారిశుద్ధ్య పనులను అకస్మిక తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నగరంలో పారిశుద్ధ్యంపై ఫిర్యాదులు రాకుండా సక్రమంగా నిర్వహించాలని, తనిఖీదారులు, కార్యదర్శులు నిత్యం క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ ఉండాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో, పురమిత్ర యాప్లో వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.