జాతీయ స్థాయి యోగ పోటీలకు జిల్లా క్రీడాకారులు

జాతీయ స్థాయి యోగ పోటీలకు జిల్లా క్రీడాకారులు
కర్నూలు స్పోర్ట్స్, మార్చి 17, ( సీమకిరణం న్యూస్) :
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వెస్ట్ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం లోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ నందు ఈనెల 26 నుంచి 29 వరకు జరగనున్న 46వ జాతీయ స్థాయి సీనియర్ యోగాసన పోటీలకు జిల్లాకు చెందిన క్రీడాకారులు లలన ప్రియ,ప్రసన్న,కళ్యాణి,అక్షర , మునిస్వామి,దాల్ స్వామిలు నవంబర్ లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించారని రాష్ట్ర యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎం అవినాష్ శెట్టి తెలిపారు.ఈ సందర్భంగా గురువారం అవుట్డోర్ స్టేడియం నందు ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమానికి రాష్ట్ర యోగ అసోసియేషన్ చైర్మన్,26 వ వార్డు డివిజన్ కార్పొరేటర్ దండు లక్ష్మి కాంత్ రెడ్డి హాజరై అభినందించారు. అనంతరం లక్ష్మి కాంత్ రెడ్డి మాట్లాడుతూ నేటి నుంచి తాడేపల్లిగూడెంలో జరగనున్న శిక్షణ శిబిరంలో జిల్లా క్రీడాకారులు పాల్గొని ఉత్తమ శిక్షణ పొంది పతకాలు సాధించి జిల్లాకు తిరిగి రావాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో హ్యాండ్ బాల్ కర్నూలు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి డాక్టర్ రుద్ర రెడ్డి,షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఈశ్వర్ నాయుడు,జిల్లా అసోసియేషన్ మెంబెర్స్ బ్రహ్మానంద రెడ్డి, ఆనంద్ రెడ్డి, పాల్గొని అభినందించారు.